IND vs NZ: చిరుతలా పరిగిత్తే కోహ్లీ జోరుకు బ్రేక్ పడిందా..? రనౌట్ వీడియో
- డైరెక్ట్ హిట్తో కోహ్లీని రనౌట్ చేసిన మ్యాట్ హెన్రీ
- 6 బంతుల్లో 4 పరుగులు చేసి రనౌట్
- తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 86/4..
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు మ్యాట్ హెన్రీ వికెట్లకు డైరెక్ట్ త్రో కొట్టి కోహ్లీని పెవిలియన్కు పంపాడు.
ఐదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి.. రచిన్ రవీంద్ర వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మిడ్ ఆన్ వైపు లైట్ షాట్ ఆడాడు. అతను సింగిల్ తీయడానికి ప్రయత్నించగా.. హెన్రీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకొని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో కొట్టాడు. అయితే.. కోహ్లీ ఫుల్ డైవ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. దీంతో.. తీవ్ర నిరాశతో కోహ్లీ గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. 6 బంతులు ఆడిన కోహ్లీ.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత టెస్టు సిరీస్లో 5 ఇన్నింగ్స్ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Read Also: Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి
ఇదిలా ఉంటే.. ముంబై టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశారు. అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. 18 బంతుల్లో 18 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్కు తొలి దెబ్బ తగిలింది.
ఆ తర్వాత.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 30 పరుగులు చేశాడు. భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను సెకండ్ డౌన్లో పంపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సిరాజ్ ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాడు. 18వ ఓవర్లో యశస్వి, సిరాజ్లు స్పిన్నర్ అజాజ్ పటేల్ ఓవర్లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (31), రిషబ్ పంత్ (1) ఉన్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.
HEART-BREAKING MOMENT OF THE DAY 💔 pic.twitter.com/st8IQrc692
— Johns. (@CricCrazyJohns) November 1, 2024
తాజావార్తలు
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
-
Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!