IND vs NZ: చిరుతలా పరిగిత్తే కోహ్లీ జోరుకు బ్రేక్ పడిందా..? రనౌట్ వీడియో
- డైరెక్ట్ హిట్తో కోహ్లీని రనౌట్ చేసిన మ్యాట్ హెన్రీ
- 6 బంతుల్లో 4 పరుగులు చేసి రనౌట్
- తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 86/4..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు మ్యాట్ హెన్రీ వికెట్లకు డైరెక్ట్ త్రో కొట్టి కోహ్లీని పెవిలియన్కు పంపాడు.
ఐదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి.. రచిన్ రవీంద్ర వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మిడ్ ఆన్ వైపు లైట్ షాట్ ఆడాడు. అతను సింగిల్ తీయడానికి ప్రయత్నించగా.. హెన్రీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకొని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో కొట్టాడు. అయితే.. కోహ్లీ ఫుల్ డైవ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. దీంతో.. తీవ్ర నిరాశతో కోహ్లీ గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. 6 బంతులు ఆడిన కోహ్లీ.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత టెస్టు సిరీస్లో 5 ఇన్నింగ్స్ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also: Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి
ఇదిలా ఉంటే.. ముంబై టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశారు. అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. 18 బంతుల్లో 18 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్కు తొలి దెబ్బ తగిలింది.
ఆ తర్వాత.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 30 పరుగులు చేశాడు. భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను సెకండ్ డౌన్లో పంపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సిరాజ్ ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాడు. 18వ ఓవర్లో యశస్వి, సిరాజ్లు స్పిన్నర్ అజాజ్ పటేల్ ఓవర్లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (31), రిషబ్ పంత్ (1) ఉన్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.
HEART-BREAKING MOMENT OF THE DAY 💔 pic.twitter.com/st8IQrc692
— Johns. (@CricCrazyJohns) November 1, 2024
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!