Virat Kohli: ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఆడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Have a 100 percent place in India’s T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీ తర్వాత భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు టీ20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఇద్దరు టెస్ట్, వన్డేకు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన విండీస్ టీ20 సిరీస్లో ఆడలేదు. దీంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొట్టిపారేశారు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడని అన్నారు. కోహ్లీ అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో అవసరం అని తెలిపారు.
ది క్రికెట్ బసు యూట్యూబ్ ఛానెల్లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘100 శాతం టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ ఆడతాడు. అతడు గత టీ20 ప్రపంచకప్లో సత్తాచాటాడు. కొన్ని క్లోజ్ గేమ్స్ జరిగాయి. పాకిస్తాన్ లాంటి మ్యాచ్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచకప్ అంటే మెగా టోర్నీ అని అందరికి తెలుసు. ఎమోషన్స్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఒక చిన్న పొరపాటు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఆ పరిస్థితులను ఎదుర్కొన్న ఆటగాళ్లు జట్టుకు కావాలి. స్ట్రైక్ రేట్ పక్కనపెడితే.. పెద్ద మ్యాచ్ల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండాలి. కోహ్లీ అలాంటి ఆటగాడు. గత పాకిస్థాన్ మ్యాచ్లో అలాంటి స్ఫూర్తిని కోహ్లీ ప్రదర్శించాడు’ అని అన్నారు.
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
‘2016 టీ20 ప్రపంచకప్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ కూడా రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ గొప్పగా ఆడాడు. ప్రతి ఒక్కరు వారి స్వంత స్టైల్లో పరుగులు చేస్తారు. సిక్సులు కొట్టడం తప్పనిసరి ఏం కాదు. మ్యాచ్లు గెలవడానికి హిట్టర్లు అవసరం లేదు. అలా అనుకుంటే వెస్టిండీస్ అన్ని ప్రపంచకప్లను గెలుచుకునేది. కోహ్లీ ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా 100 రన్స్ చేయగలడు. ఒత్తిడిలో ఆడే ఆటగాళ్లు లేకుంటే జట్టు ఇబ్బందిలో పడుతుంది’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నారు.
Also Read: IND vs IRE: ఐర్లాండ్తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
విరాట్ కోహ్లీ అనుభవం, నైపుణ్యం మరియు ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం అతడిని 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమయ్యేలా చేస్తాయని సంజయ్ బంగర్ చెప్పారు. జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీస్ మరియు యుఎస్లలో టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఇక కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నెల చివరలో ఆరంభం అయ్యే ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నాడు.
తాజావార్తలు
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!