Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
- విరాట్ కోహ్లీపై చార్టర్డ్ ఫ్లైట్ రూమర్స్ వైరల్
- లండన్–బెంగళూరు ప్రయాణంపై తప్పుడు ప్రచారం
- కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోజీలతో క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీంఇండియా సూపర్ స్టార్ బాట్స్మెన్ “విరాట్ కోహ్లీ” గురించి ఏ విషమైన సరే.. క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో ‘విరాట్ కోహ్లీ’ సంబంధించి మరోసారి ఓ పెద్ద రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో లండన్–బెంగళూరు మధ్య ప్రయాణానికి చార్టర్డ్ ఫ్లైట్స్ ఆర్సీబీ యాజమాన్యానికి హుకుం జారీ చేసినట్లు కొందరు లేనిపోని వార్తలను సృష్టించారు. అయితే తాజాగా ఈ వార్తలపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఆ పుకారు వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెండు నవ్వుతున్న ఎమోజీలతో చాలా హుందాగా స్పందించాడు. వైరలైన సోషల్ మీడియా పోస్టుల్లో.. ఆర్సీబీ మ్యాచ్ ల మధ్య మూడు రోజుల గ్యాప్ ఉంటే యాజమాన్యాన్నీ చార్టర్డ్ విమానం ఏర్పాటు చేయాలని కోహ్లీ కోరాడని ప్రచారం జరిగింది. ఈ వాదనలన్నీ ఆధారంలేనివని కోహ్లీ రెండు ఎమోజిలతో తేల్చేసాడు. ఈ మధ్యనే లండన్ నుంచి భారత్కు తిరిగివచ్చిన కోహ్లీ.. బెంగళూరులో జట్టు ట్రైనింగ్ క్యాంప్లో చేరాడు. ఎప్పటి లాగే మరోసారి ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించేందుకు కఠినంగా మైదానంలో శ్రమిస్తున్నాడు. మార్చి 28న ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ గా ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
కోహ్లీ లండన్ ప్రయాణాలపై చర్చలు కొత్తవి కావు. కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి లండన్ కు వెళ్తూ.. అక్కడ సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది విమర్శలు కూడా వ్యక్తం చేసేవారు లేకపోలేదు. దేశానికి చెందిన ప్రముఖ ఆటగాడు విదేశాల్లో ఎక్కువ సమయం గడపడం సరైనదేనా అనే పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎప్పుడునుండో వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!