RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్సీబీ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్సీబీ బౌలింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ బౌలింగ్పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్సీబీ విజయం సాధించాలంటే 11 మంది బ్యాటర్లే ఉండాలని, విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేయిస్తే ఉత్తమమని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘రీస్ టోప్లీను బాదేశారు. లాకీ ఫెర్గూసన్ను కూడా హడలెత్తించారు. ఐపీఎల్లో ఈ ఇద్దరు పెద్దగా రాణించలేదు. కోల్కతా నుంచి బెంగళూరుకు ఫెర్గూసన్ వచ్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం విల్ జాక్స్ అత్యుత్తమ బౌలర్. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం బెటర్. ఫాఫ్ డుఫ్లెసిస్ రెండు ఓవర్లు, కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లు వేయాలి’ అని అన్నారు.
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. రియాన్ పరాగ్కు ఛాన్స్!
‘విరాట్ కోహ్లీ మంచి బౌలర్. రెగ్యులర్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులు ఇస్తాడని నేను భావిస్తున్నా. విరాట్ గతంలో బాగా బౌలింగ్ చేశాడు. కాబట్టి కోహ్లీ నాలుగు ఓవర్లు వేయాలి. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ను చూస్తుంటే బాధేసింది. బంతి బౌండరీ, స్టాండ్స్లోకి వెళ్తుంటే వాటిని నిరాసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ తమ బౌలింగ్ను ఓ ఆటాడుకోవడంతో విరాట్ తట్టుకోలేకపోయాడు’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. ఐపీఎల్ 2024లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడి ఒక్క విజయంతో పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్లోనూ బెంగళూరు విజయం సాధించాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!