RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్సీబీ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్సీబీ బౌలింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ బౌలింగ్పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్సీబీ విజయం సాధించాలంటే 11 మంది బ్యాటర్లే ఉండాలని, విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేయిస్తే ఉత్తమమని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘రీస్ టోప్లీను బాదేశారు. లాకీ ఫెర్గూసన్ను కూడా హడలెత్తించారు. ఐపీఎల్లో ఈ ఇద్దరు పెద్దగా రాణించలేదు. కోల్కతా నుంచి బెంగళూరుకు ఫెర్గూసన్ వచ్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం విల్ జాక్స్ అత్యుత్తమ బౌలర్. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం బెటర్. ఫాఫ్ డుఫ్లెసిస్ రెండు ఓవర్లు, కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లు వేయాలి’ అని అన్నారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. రియాన్ పరాగ్కు ఛాన్స్!
‘విరాట్ కోహ్లీ మంచి బౌలర్. రెగ్యులర్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులు ఇస్తాడని నేను భావిస్తున్నా. విరాట్ గతంలో బాగా బౌలింగ్ చేశాడు. కాబట్టి కోహ్లీ నాలుగు ఓవర్లు వేయాలి. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ను చూస్తుంటే బాధేసింది. బంతి బౌండరీ, స్టాండ్స్లోకి వెళ్తుంటే వాటిని నిరాసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ తమ బౌలింగ్ను ఓ ఆటాడుకోవడంతో విరాట్ తట్టుకోలేకపోయాడు’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పారు. ఐపీఎల్ 2024లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడి ఒక్క విజయంతో పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్లోనూ బెంగళూరు విజయం సాధించాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!