Viral Video: జోరు వానలో చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ.. హాట్సాఫ్ లైన్మ్యాన్! వీడియో వైరల్
- జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- జలదిగ్బంధంలోపలు జిల్లాలు
- చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ
- హైముద్దీన్ సూపర్ అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lineman Restores Power in Middle of Lake in Siddipet: గత 5-6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల చెట్లు నేలకొరగడం, భారీ గాలులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో వైర్లు తెగిపడినా.. గంటల్లో బాగు చేస్తున్నారు.
తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రాల గ్రామం (బత్తులవానిపల్లి)లో విద్యుత్ సరఫరాకు కలిగింది. లైన్మెన్ హైముద్దీన్ నాగసముద్రం చెరువు మధ్యలో లైన్ తెగిపోవడం గుర్తించాడు. విద్యుత్ పునరుద్ధరించేందుకు హైముద్దీన్ పెద్ద సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి.. స్తంభం ఎక్కి మరీ కనెక్షన్ ఇచ్చారు. దాంతో నాగసముద్రాల గ్రామంలో వెలుగులు విరజిమ్మాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైన్మెన్ హైముద్దీన్పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హైముద్దీన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
Also Read: TSRTC Record: రాఖీ పౌర్ణమికి రికార్డు ప్రయాణాలు.. టీఎస్ఆర్టిసీ చరిత్రలో ఇదే తొలిసారి!
లైన్మెన్ హైముద్దీన్ సాహసంను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నాగసముద్రం చెరువు, బత్తులవానిపల్లి (బస్వాపూర్ సెక్షన్, సిద్దిపేట సర్కిల్) మధ్యలో తెగిపోయిన లైన్ను పునరుద్ధరించడం జరిగింది అని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ట్యాగ్ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ ట్వీట్పై డిప్యూటీ సీఎం స్పందించారు. ‘జోరు వానలో సైతం విద్యుత్తును పునరుద్ధరించడానికి ధైర్యంగా పనిచేసిన సిద్దిపేటకు చెందిన మన లైన్మ్యాన్ హైముద్దీన్ గారిని చూసి గర్వంగా ఉంది. మీ ధైర్యం తెలంగాణ ఇంధన శాఖ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మనం అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Proud of our lineman, Haimuddin garu from Siddipet, who braved floodwaters to restore power.
Your courage reflects the spirit of Telangana’s Energy Department.
While we serve the people with dedication, we must always keep safety first. https://t.co/6AqaKBYPEA— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 13, 2025
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!