Manipur Violence: మళ్లీ రగులుతోన్న మణిపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. మైతీలకు ఎస్టీ హోదా కల్పించాలన్న అంశంపై మొదలైన అగ్గి మళ్లీ రాజుకుంది. ఇప్పటికే హింసాత్మక ఘటనల్లో అనేక మంది చనిపోయారు. కుకీలు, మైతీలు మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల వేలాది మంది ఆశ్రయాన్ని కోల్పోయారు. ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంప్లలో తలదాచుకుంటున్నారు. తాజాగా, మళ్లీ అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పరిస్థితి చక్కబడినట్టే కనిపించినా.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇక ఉపేక్షించడానికి వీల్లేదని భావించిన బీరేన్ సింగ్ ప్రభుత్వం.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కనబడితే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్తున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి.
Read Also: Terrorists: మధ్యప్రదేశ్లో ఉగ్రవాద మూలాలు
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ఇంఫాల్ లోయలోని సేక్మయి, సుంగు, ఫయేంగ్, సెరయు తదితర ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎదురు కాల్పులు జరిపాయి. సుమారు 40 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు భద్రతా బలగాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అలాగే, 10 మంది బుల్లెట్ గాయాలతో పయేంగ్లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సాధారణ పౌరులపై దాడులకు తెగబడుతూ, ఇళ్లకు నిప్పు పెడుతున్న 40 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. అయితే, వాళ్లని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. వాళ్లంతా ఉగ్రవాదులని.. నిరాయుధులైన సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారని తెలిపారు సీఎం బీరేన్ సింగ్. గ్రామాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. AK-47తో పాటు అమెరికా సైనికులు ఉపయోగించే M-16 రైఫిళ్లు, కిలో మీటరుకు పైగా దూరంలో ఉన్న వాళ్లను కాల్చి చంపగల అత్యాధునిక స్నైపర్ తుపాకులున్నాయి. ఉగ్రవాదులకు ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి..? దీని వెనుక ఎవరున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!