AP Elections 2024: ఇదేందయ్యా ఇది.. ఓట్ల డబ్బుల కోసం మహిళల ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇదే సమయంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు నేతలు.. అయితే, ఎన్నికల సమయంలో ప్రలోభాలు కామన్గా మారిపోయాయి.. గెలుపు కోసం గిఫ్ట్లు, డబ్బులు పంచుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఇక, విచిత్రం ఏంటంటే.. నోటు ఇస్తేనే ఓటు అంటున్నారు జనం.. అసలు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు? అని గొడవకు దిగుతున్నారంటే నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
Read Also: Rajasthan: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మృతి
Also Read
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.. దీంతో, క్లైమాక్స్లో బ్యాక్ డోర్ తెరుస్తున్నాయి రాజకీయ పార్టీలు.. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ ఓటుకు రేటు కట్టి అమ్మేస్తున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ఎక్కడికక్కడ.. డబ్బు సంచులు దించడం.. ఓటర్లకు పంచేయడం చేస్తున్నారు. గ్యారెంటీగా తమకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్న వ్యక్తులకు రెండేసి వేలు.. అవసరాన్ని బట్టి రూ.5 వేల వరకు పంచుతున్నట్టు టాక్ నడుస్తోంది. మరీ విచిత్రం ఏంటంటే.. కోనసీమలో కొత్తపంచాయతీ తెరపైకి వచ్చింది.. మడికి గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు.. అదేదో మంచినీళ్లు రోడ్ల సమస్య పరిష్కారానికి కాదు.. కొన్ని పార్టీలు ఓట్ల కోసం చీరలు ఇచ్చి సరిపెడుతున్నాయట.. అయితే, తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. అలమూరు మండలం పెదపళ్లలో చీరలు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళలు ఆగ్రహంతో మండిపడ్డారు. చీరలు తీసుకెళ్లి నాయకుడి ఇంటి ముందు పడేశారు.. ఇది లోకల్గా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు.. కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ధర్నాకు దిగారు. దాదాపు వంద కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక నేతలు కొట్టేశారని మండిపడ్డారు కొండెవరం గ్రామస్తులు. ఇక, ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన కొన్ని కుటుంబాలు ఓటుపై వినూత్నంగా ప్రచారం చేపట్టాయి.. తమ ఓటు ఎవ్వరికీ అమ్మబడువు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. నిజాయితీగా మాకు అభివృద్ధి చేసే నాయకుడ్ని ఎన్నుకుంటామని కరాకండీగా చెబుతున్నారు.. ఇలా ఎన్నికల వేళా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!