Multibagger Stocks: రూ.19 పెట్టి ఈ షేర్ కొంటే.. 6 నెలల్లో రూ.48 కోట్లు సంపాదించి పెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stocks: స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే రాకేష్ జున్జున్వాలా, రాధాకృష్ణ దమానీ పేర్లు ఖచ్చితంగా ప్రజల గుర్తుకు వస్తాయి. కానీ మారుతున్న కాలంతో పాటు స్టాక్ మార్కెట్లోని పెద్ద పెట్టుబడిదారుల జాబితాలో చాలా మంది పేర్లు చేరుతున్నాయి. వారిలో విజయ్ కేడియా ఒకరు. విజయ్ కేడియా స్టాక్ మార్కెట్లో చాలా ఫేమస్. అతని పోర్ట్ఫోలియోలో చాలా పెన్నీ స్టాక్లు ఉన్నాయి. ఇవి అతనికి తక్కువ సమయంలో అధిక రాబడిని ఇచ్చాయి. ఒక ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు ఒక పెన్నీ స్టాక్ నుండి 5 నెలల్లో 48 కోట్ల రూపాయలను ముద్రించాడు. మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, విజయ్ కేడియా ఈ పెన్నీ స్టాక్ గురించి తెలుసుకోవాల్సిందే.
Read Also:Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ లారీ, తుఫాన్ వాహనం ఢీ.. ఐదుగురు మృతి..
Also Read
వెటరన్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా రూ.19.29 ధర గల పెన్నీ స్టాక్లో దాదాపు 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. 25.07 కోట్లు పెట్టుబడి పెట్టాడు. వీటిలో అతను ఈ సంవత్సరం 1 కోటి షేర్లను కొనుగోలు చేశాడు. అప్పట్లో షేరు ధర రూ.14.95. దీని తర్వాత మళ్లీ జూన్లో రూ.33.75 చొప్పున 30 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయన షేర్ల సగటు విలువ రూ.19.29గా మారింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ షేరు ధర దాదాపు రూ.56.8. దీని ప్రకారం విజయ్ కేడియా 1.3 కోట్ల షేర్ విలువ ఇప్పుడు రూ.78.34 కోట్లుగా మారింది. ఇప్పుడు కెడియా వద్ద ఉన్న మొత్తం షేర్ల ప్రస్తుత ధర నుండి సగటు కొనుగోలు ధరను తీసివేస్తే, ఆ విలువ రూ. 48,76,50,000 అవుతుంది. అంటే విజయ్ కేడియా ఈ షేర్ నుంచి 6 నెలల్లో రూ.48 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Read Also:PAK vs SL: ఆకాష్ చెప్పినట్టే సూపర్-4 మ్యాచ్లో పాక్ ఓటమి.. ఆసియా కప్ ఫైనల్కు శ్రీలంక!
కెడియా డబ్బు పెట్టుబడి పెట్టిన కంపెనీ నిర్మాణ సంస్థ. దీని పేరు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది వంతెన, ఆనకట్ట, సొరంగం, రహదారి, పారిశ్రామిక నిర్మాణం, ఇతర రకాల సివిల్ ఇంజనీరింగ్ పనులను చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4300 కోట్లు. దాని స్టాక్ 3 సంవత్సరాల సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR) 67 శాతంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-24 మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం 24.20 శాతం పెరిగి రూ.1119 కోట్లకు చేరుకుంది. నికర లాభం 16.22 శాతం పెరిగి రూ.43 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం లాభం 2022ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 154 శాతం పెరిగి రూ.183 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయాలు కూడా 24.32 శాతం పెరిగి రూ.4202 కోట్లకు చేరాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!