Multibagger Stocks: రూ.19 పెట్టి ఈ షేర్ కొంటే.. 6 నెలల్లో రూ.48 కోట్లు సంపాదించి పెట్టింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stocks: స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే రాకేష్ జున్జున్వాలా, రాధాకృష్ణ దమానీ పేర్లు ఖచ్చితంగా ప్రజల గుర్తుకు వస్తాయి. కానీ మారుతున్న కాలంతో పాటు స్టాక్ మార్కెట్లోని పెద్ద పెట్టుబడిదారుల జాబితాలో చాలా మంది పేర్లు చేరుతున్నాయి. వారిలో విజయ్ కేడియా ఒకరు. విజయ్ కేడియా స్టాక్ మార్కెట్లో చాలా ఫేమస్. అతని పోర్ట్ఫోలియోలో చాలా పెన్నీ స్టాక్లు ఉన్నాయి. ఇవి అతనికి తక్కువ సమయంలో అధిక రాబడిని ఇచ్చాయి. ఒక ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు ఒక పెన్నీ స్టాక్ నుండి 5 నెలల్లో 48 కోట్ల రూపాయలను ముద్రించాడు. మీరు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, విజయ్ కేడియా ఈ పెన్నీ స్టాక్ గురించి తెలుసుకోవాల్సిందే.
Read Also:Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ లారీ, తుఫాన్ వాహనం ఢీ.. ఐదుగురు మృతి..
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
వెటరన్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా రూ.19.29 ధర గల పెన్నీ స్టాక్లో దాదాపు 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. 25.07 కోట్లు పెట్టుబడి పెట్టాడు. వీటిలో అతను ఈ సంవత్సరం 1 కోటి షేర్లను కొనుగోలు చేశాడు. అప్పట్లో షేరు ధర రూ.14.95. దీని తర్వాత మళ్లీ జూన్లో రూ.33.75 చొప్పున 30 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయన షేర్ల సగటు విలువ రూ.19.29గా మారింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ షేరు ధర దాదాపు రూ.56.8. దీని ప్రకారం విజయ్ కేడియా 1.3 కోట్ల షేర్ విలువ ఇప్పుడు రూ.78.34 కోట్లుగా మారింది. ఇప్పుడు కెడియా వద్ద ఉన్న మొత్తం షేర్ల ప్రస్తుత ధర నుండి సగటు కొనుగోలు ధరను తీసివేస్తే, ఆ విలువ రూ. 48,76,50,000 అవుతుంది. అంటే విజయ్ కేడియా ఈ షేర్ నుంచి 6 నెలల్లో రూ.48 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Read Also:PAK vs SL: ఆకాష్ చెప్పినట్టే సూపర్-4 మ్యాచ్లో పాక్ ఓటమి.. ఆసియా కప్ ఫైనల్కు శ్రీలంక!
కెడియా డబ్బు పెట్టుబడి పెట్టిన కంపెనీ నిర్మాణ సంస్థ. దీని పేరు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది వంతెన, ఆనకట్ట, సొరంగం, రహదారి, పారిశ్రామిక నిర్మాణం, ఇతర రకాల సివిల్ ఇంజనీరింగ్ పనులను చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4300 కోట్లు. దాని స్టాక్ 3 సంవత్సరాల సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR) 67 శాతంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-24 మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం 24.20 శాతం పెరిగి రూ.1119 కోట్లకు చేరుకుంది. నికర లాభం 16.22 శాతం పెరిగి రూ.43 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం లాభం 2022ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 154 శాతం పెరిగి రూ.183 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయాలు కూడా 24.32 శాతం పెరిగి రూ.4202 కోట్లకు చేరాయి.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!