టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, రాజశేఖర్ను ఇదివరకు చూడని రీతిలో రవి కిరణ్ కోలా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
AlsoRead : Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..
అయితే గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన గెస్ట్ రోల్ ఉందని, ఆ పాత్ర కోసం చిత్ర బృందం ఒక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ను సంప్రదించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. గ్రామీణ రాజకీయాలు, యాక్షన్ అంశాలతో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ మేకోవర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని టాక్. రూమర్స్ ఎలా ఉన్నా, అతి త్వరలోనే ఈ గెస్ట్ రోల్ ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
