VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
- ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు హైకోర్టు బిగ్ షాక్..
- మనీలాండరింగ్ కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIJAY: తమిళనాడులో సీఎం ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్కు బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. విజయ్ ఆదాయాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనీలాండరింగ్ దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారారి, జస్టిన్ జి. అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారించింది.
Read Also: Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
Also Read
- Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
ఈ పిటిషన్ స్వీకరించదగినదా..? లేదా అనే సందేహాలపై రిజస్ట్రీ ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదని గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. ఈ అంశాన్ని నిర్ణయించడం న్యాయపరమైన విధి అని, రిజిస్ట్రీకు సంబంధం లేదని పేర్కొంది. ఈ పిటిషన్ను చెన్నైకి చెందిన ఎం రాజ్ కుమార్ దాళఖలు చేశారు. ఈ కేసులో ఐటీ అధికారులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, విజయ్కు సంబంధించిన సెర్చ్ ప్రొసీడింగ్స్, అఫిడవిట్లు, పెనాల్టీ ఆర్డర్లను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్దారు కోర్టును కోరారు.
ఈ కేసును మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద కూడా దర్యాప్తు జరపాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. సోదాలు, చట్టపరమైన విచారణ సందర్బంవగా వెల్లడైన ఆదాయాన్ని చెప్పకపోవడం, లెక్కలో చూపని నగదు పారితోషకంగా తీసుకోవడం, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టడం వంటి వాటికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420, 467, 470, 471, 120B కింద మోసం, నకిలీ పత్రాలు, కుట్ర వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. ఇది విజయ్ ఆస్తులకు సంబంధించి దాఖలైన మూడో కేసు కావడం గమనార్హం. ఇంతకుముందు దాఖలైన పిటిషన్లో ఒక కేసులో ఆదాయపన్ను శాఖ స్పందించాలని కోర్టు విజయ్కి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విజయ్ నటించిన ‘‘పులి’’ సినిమాకు సంబంధించింది. 2015 పులి సినిమా సమయంలో ఐటీ శాఖ విజయ్ నివాసాలు, కార్యలయాల్లో సోదాలు నిర్వహించింది. నిర్మాతల నుంచి రూ. 4.93 కోట్ల నగదు, రూ. 16 కోట్ల చెక్కులు ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలకు పన్ను చెల్లింపులు జరగలేదని గుర్తించారు. నిర్మాతలు చెక్కుల రూపంలో ఇచ్చిన వాటికి మాత్రమే టీడీఎస్ జమ చేశారు తప్పా, నగదు రూపంలో వాటికి చెల్లించలేదు. దీని తర్వాత విజయ్ అదనంగా రూ. 15 కోట్లను ఆదాయంగా ప్రకటించి పన్నులు చెల్లించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!