VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
- ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు హైకోర్టు బిగ్ షాక్..
- మనీలాండరింగ్ కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIJAY: తమిళనాడులో సీఎం ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్కు బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. విజయ్ ఆదాయాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనీలాండరింగ్ దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారారి, జస్టిన్ జి. అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారించింది.
Read Also: Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
ఈ పిటిషన్ స్వీకరించదగినదా..? లేదా అనే సందేహాలపై రిజస్ట్రీ ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదని గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. ఈ అంశాన్ని నిర్ణయించడం న్యాయపరమైన విధి అని, రిజిస్ట్రీకు సంబంధం లేదని పేర్కొంది. ఈ పిటిషన్ను చెన్నైకి చెందిన ఎం రాజ్ కుమార్ దాళఖలు చేశారు. ఈ కేసులో ఐటీ అధికారులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, విజయ్కు సంబంధించిన సెర్చ్ ప్రొసీడింగ్స్, అఫిడవిట్లు, పెనాల్టీ ఆర్డర్లను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్దారు కోర్టును కోరారు.
ఈ కేసును మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద కూడా దర్యాప్తు జరపాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. సోదాలు, చట్టపరమైన విచారణ సందర్బంవగా వెల్లడైన ఆదాయాన్ని చెప్పకపోవడం, లెక్కలో చూపని నగదు పారితోషకంగా తీసుకోవడం, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టడం వంటి వాటికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420, 467, 470, 471, 120B కింద మోసం, నకిలీ పత్రాలు, కుట్ర వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. ఇది విజయ్ ఆస్తులకు సంబంధించి దాఖలైన మూడో కేసు కావడం గమనార్హం. ఇంతకుముందు దాఖలైన పిటిషన్లో ఒక కేసులో ఆదాయపన్ను శాఖ స్పందించాలని కోర్టు విజయ్కి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విజయ్ నటించిన ‘‘పులి’’ సినిమాకు సంబంధించింది. 2015 పులి సినిమా సమయంలో ఐటీ శాఖ విజయ్ నివాసాలు, కార్యలయాల్లో సోదాలు నిర్వహించింది. నిర్మాతల నుంచి రూ. 4.93 కోట్ల నగదు, రూ. 16 కోట్ల చెక్కులు ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలకు పన్ను చెల్లింపులు జరగలేదని గుర్తించారు. నిర్మాతలు చెక్కుల రూపంలో ఇచ్చిన వాటికి మాత్రమే టీడీఎస్ జమ చేశారు తప్పా, నగదు రూపంలో వాటికి చెల్లించలేదు. దీని తర్వాత విజయ్ అదనంగా రూ. 15 కోట్లను ఆదాయంగా ప్రకటించి పన్నులు చెల్లించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..