VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
- ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు హైకోర్టు బిగ్ షాక్..
- మనీలాండరింగ్ కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIJAY: తమిళనాడులో సీఎం ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్కు బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. విజయ్ ఆదాయాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనీలాండరింగ్ దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారారి, జస్టిన్ జి. అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారించింది.
Read Also: Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ఈ పిటిషన్ స్వీకరించదగినదా..? లేదా అనే సందేహాలపై రిజస్ట్రీ ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదని గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. ఈ అంశాన్ని నిర్ణయించడం న్యాయపరమైన విధి అని, రిజిస్ట్రీకు సంబంధం లేదని పేర్కొంది. ఈ పిటిషన్ను చెన్నైకి చెందిన ఎం రాజ్ కుమార్ దాళఖలు చేశారు. ఈ కేసులో ఐటీ అధికారులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, విజయ్కు సంబంధించిన సెర్చ్ ప్రొసీడింగ్స్, అఫిడవిట్లు, పెనాల్టీ ఆర్డర్లను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్దారు కోర్టును కోరారు.
ఈ కేసును మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద కూడా దర్యాప్తు జరపాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. సోదాలు, చట్టపరమైన విచారణ సందర్బంవగా వెల్లడైన ఆదాయాన్ని చెప్పకపోవడం, లెక్కలో చూపని నగదు పారితోషకంగా తీసుకోవడం, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టడం వంటి వాటికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420, 467, 470, 471, 120B కింద మోసం, నకిలీ పత్రాలు, కుట్ర వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. ఇది విజయ్ ఆస్తులకు సంబంధించి దాఖలైన మూడో కేసు కావడం గమనార్హం. ఇంతకుముందు దాఖలైన పిటిషన్లో ఒక కేసులో ఆదాయపన్ను శాఖ స్పందించాలని కోర్టు విజయ్కి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విజయ్ నటించిన ‘‘పులి’’ సినిమాకు సంబంధించింది. 2015 పులి సినిమా సమయంలో ఐటీ శాఖ విజయ్ నివాసాలు, కార్యలయాల్లో సోదాలు నిర్వహించింది. నిర్మాతల నుంచి రూ. 4.93 కోట్ల నగదు, రూ. 16 కోట్ల చెక్కులు ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలకు పన్ను చెల్లింపులు జరగలేదని గుర్తించారు. నిర్మాతలు చెక్కుల రూపంలో ఇచ్చిన వాటికి మాత్రమే టీడీఎస్ జమ చేశారు తప్పా, నగదు రూపంలో వాటికి చెల్లించలేదు. దీని తర్వాత విజయ్ అదనంగా రూ. 15 కోట్లను ఆదాయంగా ప్రకటించి పన్నులు చెల్లించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!