Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
- అందరూ పరార్.. ఒంటరిగా 'దీదీ'
- బెంగాల్లో ముగిసిన మమత శకం
- అధికారుల రాజీనామాల పరంపర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Political Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం పాలై రెండు రోజులు గడుస్తున్నా, రాజకీయ నాటకం మాత్రం ఇంకా ముగియలేదు. రాష్ట్రంలో బీజేపీ తన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుండగా, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి మమతా బెనర్జీ మాత్రం మొండిగా నిరాకరిస్తున్నారు.
నో రాజీనామా..
సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు పాత ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే మమతా బెనర్జీ మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రభుత్వం మమతతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భద్రతను భారీగా తగ్గించింది. మమత పక్కకు తప్పుకోకపోయినా, ఆమె హయాంలో కీలక పదవులు అనుభవించిన సలహాదారులు, మాజీ అధికారులు మాత్రం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శులు అలపన్ బంద్యోపాధ్యాయ్, హెచ్కే ద్వివేది, మనోజ్ పంత్ తాజాగా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఆర్థికవేత్త అభిరూప్ సర్కార్ కూడా తన రాజీనామాను సమర్పించారు. “నన్ను మమతా బెనర్జీ నియమించారు. ఆమె ఓడిపోయారు కాబట్టి, నేను ఈ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు లేదు” అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా సైతం గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపారు.
Also Read
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
బీజేపీ విజయ విహారం..
రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి స్పష్టమైన మెజారిటీ సాధించింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, మే 9న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించడానికి టీఎంసీ నిరాకరించగా, బీజేపీ మాత్రం మమతపై విమర్శల దాడి పెంచింది. “అధికారులందరికీ కనీస నైతికత ఉంది కాబట్టి రాజీనామా చేశారు. కానీ మమతకు మాత్రం ఆ సిగ్గు లేదు. సొంత గడ్డపైనే ఓడిపోయినా ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు” అని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఎద్దేవా చేశారు. మొత్తానికి బెంగాల్లో అధికార మార్పిడి ఉత్కంఠభరితంగా సాగుతోంది. మే 9న జరిగే ప్రమాణ స్వీకారంతో ఈ రాజకీయ అనిశ్చితికి తెరపడనుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?