Turkey Parliament: టర్కీ పార్లమెంట్లో పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు.. ఎందుకంటే?
- టర్కీ పార్లమెంట్లో ఘర్షణ వాతావరణం
- ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Parliament: టర్కీ పార్లమెంట్లో శుక్రవారం ఎంపీలు అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చాలా మంది ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. ఈ గొడవ ఎంత తీవ్రమైందంటే ఇద్దరు ఎంపీలు రక్తమోడారు. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అహ్మత్ సిక్ మాట్లాడుతుండగా.. ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. ప్రతిపక్ష ఎంపీ కూడా తనను తాను సమర్థించుకుంటూ అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో అహ్మత్ మెడ, ముఖం నుండి రక్తం రావడం ప్రారంభమైంది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. సిక్ తన పార్టీ ఎంపీ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకారం రాజకీయంగా ప్రేరేపించబడిన కారణాల వల్ల జైలుకెళ్లారు. ఎర్డోగన్ అధికార పార్టీని “ఉగ్రవాద సంస్థ” అని పిలిచిన తర్వాత సిక్పై దాడి జరిగిందని వార్తా సంస్థ నివేదించింది. ఈ కొట్లాటలో ఎర్డోగాన్ పార్టీ ఎంపీ, మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ఆల్పే ఓజాలాన్, టర్క్సీ వర్కర్స్ పార్టీకి చెందిన అహ్మత్ సిక్ మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ మహిళా ఎంపీ కిందపడిపోవడంతో ఆమెకు రక్తస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత, టర్కీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఓజ్గుర్ ఓజెల్ దీనిని సిగ్గుమాలిన సంఘటన అని పిలిచారు. ఈ రోజు పదాలు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రదేశంలో కిక్స్, పంచ్లు ఉపయోగించారని అన్నారు. ఆ వ్యక్తులు ఈ రోజు మహిళలను కూడా వదలలేదు, పవిత్రమైన పార్లమెంటు మైదానంలో రక్తం ఉంది, ఇది చాలా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అయితే టర్కీ చట్టసభ సభ్యుల మధ్య శారీరక గొడవలు జరగడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకముందు కూడా పలు సందర్భాల్లో ఎంపీలు ఒకరినొకరు గుద్దుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.
Also Read
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
A fight in the Turkish parliament#Turkey pic.twitter.com/qrFg9UGip3
— Karina Karapetyan (@KarinaKarapety8) August 16, 2024
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!