Turkey Parliament: టర్కీ పార్లమెంట్లో పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు.. ఎందుకంటే?
- టర్కీ పార్లమెంట్లో ఘర్షణ వాతావరణం
- ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Parliament: టర్కీ పార్లమెంట్లో శుక్రవారం ఎంపీలు అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చాలా మంది ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. ఈ గొడవ ఎంత తీవ్రమైందంటే ఇద్దరు ఎంపీలు రక్తమోడారు. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అహ్మత్ సిక్ మాట్లాడుతుండగా.. ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. ప్రతిపక్ష ఎంపీ కూడా తనను తాను సమర్థించుకుంటూ అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో అహ్మత్ మెడ, ముఖం నుండి రక్తం రావడం ప్రారంభమైంది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజానికి జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. సిక్ తన పార్టీ ఎంపీ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకారం రాజకీయంగా ప్రేరేపించబడిన కారణాల వల్ల జైలుకెళ్లారు. ఎర్డోగన్ అధికార పార్టీని “ఉగ్రవాద సంస్థ” అని పిలిచిన తర్వాత సిక్పై దాడి జరిగిందని వార్తా సంస్థ నివేదించింది. ఈ కొట్లాటలో ఎర్డోగాన్ పార్టీ ఎంపీ, మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ఆల్పే ఓజాలాన్, టర్క్సీ వర్కర్స్ పార్టీకి చెందిన అహ్మత్ సిక్ మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ మహిళా ఎంపీ కిందపడిపోవడంతో ఆమెకు రక్తస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత, టర్కీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఓజ్గుర్ ఓజెల్ దీనిని సిగ్గుమాలిన సంఘటన అని పిలిచారు. ఈ రోజు పదాలు మాత్రమే ఉపయోగించాల్సిన ప్రదేశంలో కిక్స్, పంచ్లు ఉపయోగించారని అన్నారు. ఆ వ్యక్తులు ఈ రోజు మహిళలను కూడా వదలలేదు, పవిత్రమైన పార్లమెంటు మైదానంలో రక్తం ఉంది, ఇది చాలా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. అయితే టర్కీ చట్టసభ సభ్యుల మధ్య శారీరక గొడవలు జరగడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకముందు కూడా పలు సందర్భాల్లో ఎంపీలు ఒకరినొకరు గుద్దుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
A fight in the Turkish parliament#Turkey pic.twitter.com/qrFg9UGip3
— Karina Karapetyan (@KarinaKarapety8) August 16, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!