Vidadala Rajini: ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు!
- ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్
- ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి విడదల రజని
- ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి విడదల రజని తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత జీవితాలను పూర్తిగా నాశనం చేస్తోందని విడదల రజని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చివరికి వారి పార్టీ నేతలే, వారి కుమారులే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరకడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Also Read: Atchutapuram Fire Accident: ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం!
Also Read
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని, గంజాయి విక్రయాలు ఏకంగా 251 శాతం పెరిగాయని తెలిపారు. ఈ గణాంకాలే కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తోందా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడో తిరుగుతున్నారని ఆరోపించారు. హోంమంత్రి ఉన్నారో లేదో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకోకపోతే యువత భవిష్యత్ పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన మాజీ మంత్రి.. ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్కార్న్, కూల్డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!