Vice President Candidate: ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ‘వెయిట్ అండ్ సీ’ అంటున్న విపక్షాలు. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Candidate: ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించే విషయంలో ప్రతిపక్షాలు వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతున్నాయి. అందుకే ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అధికార కూటమి (ఎన్డీఏ) క్యాండేట్ పేరును ప్రకటించాకే తమ అభ్యర్థి పేరును వెల్లడిస్తామని చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలాగైతే ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపారో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కూడా అలాగే జాయింట్ క్యాండేట్ని పోటీకి దింపాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ కూటమి ద్రౌపదీ ముర్ము పేరును ప్రకటించకముందే విపక్షాలు యశ్వంత్సిన్హా పేరును డిక్లేర్ చేశారు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రూలింగ్ పార్టీ ఏ అభ్యర్థిని బరిలోకి దించుతుందో సరిగ్గా అదే స్థాయి, అలాంటి ప్రొఫైలే కలిగిన నాయకుణ్ని సెలెక్ట్ చేయాలని అపొజిషన్ పార్టీలు అనుకుంటున్నాయి. తద్వారా గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఇప్పటికే వన్ సైడ్ అయిన విషయం తెలిసిందే. ద్రౌపదీ ముర్ముకి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
అందువల్ల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇలా తేలిపోకూడదని ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. తామేంటో నిరూపించుకోవాలనే ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్డీఏకి అపొజిషన్ పార్టీలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ద్రౌపదీ ముర్ము వెనకబడిన గిరిజన తెగకు చెందిన వ్యక్తి కావటంతోపాటు మహిళ అవటంతో ఎన్డీఏలో లేని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బలమైన రాష్ట్రపతి అభ్యర్థి కోసం విపక్షాలు కూడా పలువురి పేర్లను పరిశీలించినా, పోటీ చేస్తారా అంటూ అడిగినా వాళ్లు ముందుకు రాకపోవటంతో చివరికి యశ్వంత్సిన్హాను ఎంపిక చేశాయి.
ఉపరాష్ట్రపతి విషయంలో అటు అధికార పక్షం నుంచి గానీ ఇటు ప్రతిపక్షం నుంచి గానీ స్పష్టమైన ప్రకటనలు వెలువడట్లేదు. ఎన్డీఏ క్యాండేట్లుగా ఇద్దరు, ముగ్గురు నేతలు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. బీజేపీ బహుశా ఇవాళ తన అభ్యర్థిని ప్రకటించొచ్చని అంటున్నారు. అపొజిషన్ ఇంత వరకూ ఒక్క పేరును కూడా తెర మీదికి తేలేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించటం కోసం ఏకతాటి మీదికి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఒకదానికొకటి టచ్లోనే ఉన్నాయి. అంతర్గతంగా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. కానీ ఏమాత్రం లీకు చేయట్లేదు. దీంతో వైస్ ప్రెసిడెంట్ క్యాండేట్ అంశం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!