Venkaiah Naidu: నేను పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి.. నాయకుడు ఎక్కడో ఉండి, ప్రజలు ఎక్కడో ఉండేలా ఉండకూడదని తెలిపారు. తాను పదవీ విరమణ చేశానని.. పెదవి విరమణ చేయలేదన్నారు. బూతులు మాట్లాడిన వారెవరూ గతంలో అసెంబ్లీలోకి రాలేదని గుర్తు చేశారు. ప్రజలు ఆదర్శవంతంగా ఉన్న వారిని గెలిపించాలని సూచించారు. కొత్త వారికి జ్యేష్ఠ కార్యకర్తలు మార్గదర్శకంగా మారాలన్నారు. పదవులు ఆశించకుండా, ప్రజల్లో తిరిగినా రాజకీయ నాయకుడుగా గుర్తించబడతారు.. రాజకీయం అంటే పదవులకు సోపానం అనుకోకూడదన్నారు.
READ MORE: Revanth Reddy: ఢిల్లీ టూర్లో రేవంత్రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఆర్టికల్ 370 రద్దుతో అందరూ సంతోషించారు.. రక్తపాతం చిందించకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని వెంకయ్యనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. “ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం మూడవ విజయం.. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. మీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటే నక్సల్స్ కూడా బయటకొచ్చి ఎన్నికల లో పోటీ చేయండి.. తుపాకీ పోలీసుల చేతిలో ఉండచ్చు కానీ ప్రతీ ఒక్కరి చేతిలో ఉండకూడదు.. మత కలహాలు దాదాపు తగ్గిపోయాయి.. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుంది.. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మాట్లాడటం నా పని కాదు.. నూతన విద్యా విధానం తీసుకొచ్చి పాఠ్యపుస్తకాలలో కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొస్తోంది.. MBBS, ENGINEERING లను కూడా మాతృభాషలో చదువుకునేలా చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.. మాతృభాష కళ్ళు అయితే ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను తెలుగులో పరిపాలన చేయాలని కోరాను.. తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడానికి ఏం ఇబ్బంది.. తెలుగులో ఇవ్వడం దయాదాక్షిణ్యమా.. ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు పర్యాటకం పెరిగింది.. ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారత్ ను పెట్టిన వ్యక్తి మోడీ..” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!