Venkaiah Naidu: నేను పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి.. నాయకుడు ఎక్కడో ఉండి, ప్రజలు ఎక్కడో ఉండేలా ఉండకూడదని తెలిపారు. తాను పదవీ విరమణ చేశానని.. పెదవి విరమణ చేయలేదన్నారు. బూతులు మాట్లాడిన వారెవరూ గతంలో అసెంబ్లీలోకి రాలేదని గుర్తు చేశారు. ప్రజలు ఆదర్శవంతంగా ఉన్న వారిని గెలిపించాలని సూచించారు. కొత్త వారికి జ్యేష్ఠ కార్యకర్తలు మార్గదర్శకంగా మారాలన్నారు. పదవులు ఆశించకుండా, ప్రజల్లో తిరిగినా రాజకీయ నాయకుడుగా గుర్తించబడతారు.. రాజకీయం అంటే పదవులకు సోపానం అనుకోకూడదన్నారు.
READ MORE: Revanth Reddy: ఢిల్లీ టూర్లో రేవంత్రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఆర్టికల్ 370 రద్దుతో అందరూ సంతోషించారు.. రక్తపాతం చిందించకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని వెంకయ్యనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. “ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం మూడవ విజయం.. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. మీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటే నక్సల్స్ కూడా బయటకొచ్చి ఎన్నికల లో పోటీ చేయండి.. తుపాకీ పోలీసుల చేతిలో ఉండచ్చు కానీ ప్రతీ ఒక్కరి చేతిలో ఉండకూడదు.. మత కలహాలు దాదాపు తగ్గిపోయాయి.. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంటుంది.. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మాట్లాడటం నా పని కాదు.. నూతన విద్యా విధానం తీసుకొచ్చి పాఠ్యపుస్తకాలలో కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొస్తోంది.. MBBS, ENGINEERING లను కూడా మాతృభాషలో చదువుకునేలా చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.. మాతృభాష కళ్ళు అయితే ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను తెలుగులో పరిపాలన చేయాలని కోరాను.. తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడానికి ఏం ఇబ్బంది.. తెలుగులో ఇవ్వడం దయాదాక్షిణ్యమా.. ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు పర్యాటకం పెరిగింది.. ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన భారత్ ను పెట్టిన వ్యక్తి మోడీ..” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!