Venkaiah Naidu : అయితే ప్రెసిడెంట్, లేదా డిసిడెంట్.. ఇది నా నైజం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu About her political journey
అయితే ప్రెసిడెంట్, లేదా డిసిడెంట్.. అదీకాక పోతే.. రెసిడెంట్ అనే థాట్ నాకు లేదంటున్నారు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి హోదాలో చివరిసారిగా విలేఖరులతో విందు భోజనం చేశారు వెంకయ్య నాయుడు. అనంతరం విలేకరులతో ముచ్చటిస్తూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
1965లో ఏబీవీపీ నాయకుడి మొదలైన తన రాజకీయ ప్రస్థానం నుంచి ఉప రాష్ట్రపతి బాధత్యలు స్వీకరించి.. ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ఆయన పంచుకున్నారు. పహిల్వాన్ కాంతారావుతో జరిగిన గొడవ తరువాత.. జై ఆంధ్ర ఉద్యమం, జేపీ ఉద్యమం, ఎమర్జెన్సీ జైలు జీవితం రాజకీయాల్లో రాటుదేల్చాయన్న ఆయన.. ఆత్మకూరు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయిన సంఘటనను స్మరించుకున్నారు. అప్పటికే రెండు సార్లు నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచిన వెంకయ్య నాయుడు.. ఆ తరువాత ఆత్మకూరు నుంచి బరిలోకి దిగారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తనకు ఎంతో మేలు చేసిందని.. ఒక వేళ ఆత్మకూరులో గెలిచి ఉంటే.. రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉండేవాణ్నేమోనని అభిప్రాయపడ్డారు.
అయితే.. ఎమర్జెన్సీ సమయంలో విశాఖపట్నం జైలులో ఉండగా.. ఆనాడు కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య విశాఖకు సంజయ్గాంధీని తీసుకువచ్చి బహిరంగ సభ నిర్వహిస్తే.. జైలులో ఉన్న తాను అనారోగ్యం సాకుతో ఆసుపత్రికి వెళ్లి ఆ బహిరంగ సభను భగ్నం చేసిన విషయాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా.. దేవుడి దయ, పెద్దల అభిమానంతో అన్నీ పదవులు దక్కాయని.. ఈ ప్రోటొకాల్ ఆంఓల తన వ్యక్తిత్వానికి సరిపడవన్నారు. అయితే.. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లా ప్రముఖ కళాశాలల్లో చదువుకోకపోయినా.. నిరంతరం ప్రజలతో మమేకం అవడమే జ్ఞానం నేర్పిందన్నారు.
అయితే.. మోడీతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని.. ఆయనకు చేసిన కొన్ని సూచనలపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మోడీ పనితీరుపై తన భార్య రెండు సూచనలు చేసిందన్నారు. మొదటిది మోడీని అప్పుడప్పుడు నవ్వుతూ ఉండమనడం కాగా.. రెండోది రోజూ అవసరమైనంత నిద్ర. ఇదే విషయాన్ని మోడీకి చెప్పగా.. నవ్వడం అలవర్చుకున్నారని.. కానీ నిద్ర రావడం కష్టమేఅని సమాధానం ఇచ్చారట.
అయితే.. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయనకు రాష్ట్రపతి అయ్యే ఆలోచన లేదన్నారు. కానీ.. క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనన్నారు. పరిస్థితులపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానుకోనని, తన ముందుకు వచ్చే అంశాన్ని ప్రధాని ముందు పెడుతానన్నారు. అయితే ఇదే సమయంలో.. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి.. బతికున్న వారి గురించి రాస్తే యథార్థాలు రాయాలి.. అలా రాస్తే అనర్థాలు వస్తాయి’ అంటూ చమత్కరించారు.
అయితే.. ఫైనల్గా ఏ పోస్టు ఇచ్చినా తీసుకోనని.. ఇక మళ్లీ పోస్ట్ మ్యాన్ కాదలచుకోలేదన్నారు వెంకయ్య నాయుడు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..