Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!
- 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం
- మహిళల కోసం 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం
- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా గల్లా ఎగిరేసుకోవచ్చు’ అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ‘ప్రజాపాలన ప్రగతిబాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… ‘డ్వాక్రా మహిళలకు 25 వేల కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మహబూబాబాద్ నగరంలో మహిళ శక్తి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మహిళల కోసం 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నాం. మహిళల సంక్షేమం ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆ ఇళ్ళు, ఊరు బాగుంటుంది. పేదలు కరెంట్ బిల్లులు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలిపివేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మా ప్రభుత్వం అదే పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
Also Read: Jagga Reddy: నెలలో 20 రోజులు, విదేశాల్లో కేటీఆర్ ఏం చేస్తున్నాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
‘ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాయి. గత పాలకుల కుటుంబాలు కోటీశ్వరులు అయ్యారు తప్ప.. పేదల బతుకులు బాగుపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి’ అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!