Vellampalli Srinivas Rao : ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం
- ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారు
- కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27న నిరసన
- ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం : వెల్లంపల్లి శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్ చార్జీల మోసంపై ప్రజలతో కలసి చంద్రబాబును ఎండగడతామన్నారు.. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా విద్యుత్ చార్జీల భారం మోపకూడదన్నారు.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు.
Udalu Benefits: ఊబకాయంతో బాధ పడుతున్నారా? ఊదలు ట్రై చేయండి..
Also Read
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
అధికారం లోకి రాగానే చంద్రబాబు బాధుడు బాబుగా మారిపోయారని మాజీమంత్రి మేరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే కరెంట్ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు.. ఆరోజుల్లోనే ప్రజలు ఆందోళనలు చేసి కరెంట్ చార్జీలు పెంచ వద్దంటే గుర్రాలతో తొక్కించారన్నారు.. విద్యుత్ చార్జీలపై 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలసి పోరాటాలు చేస్తామన్నారు.. వైసీపీ హయంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచితముగా కరెంట్ ఇచ్చామన్నారు. చంద్రబాబు మోసాలు ఇకనైనా అందరూ గమనించాలని మాజీమంత్రి నాగార్జున కోరారు.
ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని మాజీమంత్రి జోగిరమేష్ ఆరోపించారు. విద్యుత్ చార్జీలను పెంచి సీఎం చంద్రబాబు ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. చార్జీల భారంపై ప్రజలకు అండగా నిలిచేందుకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.. ప్రభుత్వం ప్రజలపై 15,485 కోట్ల భారం మోపిందన్నారు. ఇప్పటికే రైతులకు అండగా ఉండి పోరాటాలు చేశామన్నారు.. ఆరునెలల్లో సూపర్ సిక్స్ ఇస్తాడనుకుంటే ఎటు పోయిందో తెలియదన్నారు.. వైసీపీ 5 కోట్ల మంది ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం ఉందన్నారు.. ఆరునెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలుజరిగేదో అంటూ ప్రజలు బాధ పడుతున్నారన్నారు.. దివంగత నేత వైఎస్ఆర్ ఆనాడు పెంచిన కరెంటు చార్జీల మీద పోరాటం చేస్తే.. చంద్రబాబు కాల్పుల్లో పలువురు మరణించిన విషయం అందరికి గుర్తుందన్నారు..
Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్స్ ఇవే!
తాజావార్తలు
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
-
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
-
Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!