GST Notice: డిజిటల్ లావాదేవీలపై అధికారుల దృష్టి.. కూరగాయల వ్యాపారికి 29 లక్షల జీఎస్టీ నోటీసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Notice: కర్ణాటకలోని హవేరి జిల్లాకి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నాలుగేళ్లుగా చిన్న కూరగాయల షాపు నడుపుతున్న శంకర్గౌడ హడిమణి అనే వ్యాపారికి జీఎస్టీ అధికారులు ఏకంగా రూ. 29 లక్షల పన్ను నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుతో ఆయన సమస్యల్లో పడ్డారు. హవేరి మున్సిపల్ హై స్కూల్ వద్ద తన కూరగాయల షాపును నడుపుతున్న శంకర్గౌడ, రైతుల నుండి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి స్వయంగా విక్రయిస్తారు. ఈ మధ్య ఎక్కువ మంది కస్టమర్లు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.
Read Also:Viral Video: మరణం దరిదాపుల్లోకి వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన RPF కానిస్టేబుల్..!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులు శంకర్గౌడ అకౌంట్స్ ఆధారంగా నాలుగేళ్లలో రూ.1.63 కోట్లు విలువైన లావాదేవీలు జరిగాయని, అందువల్ల రూ.29 లక్షలు జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుందని ఆయనకు నోటీసు పంపారు. అయితే ఈ విషయమై తన వాదనను తెలిపాడు వ్యాపారి శంకర్గౌడ. నేను ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు చేస్తాను. నా దెగ్గర పక్కా రికార్డులున్నాయి. తాను నేరుగా రైతుల నుంచి తీసుకున్న కూరగాయలు విక్రయిస్తున్నాను. ఇవన్నీ ట్యాక్స్-ఫ్రీ సరుకులు. అటువంటి వాటిపై ఎలా జీఎస్టీ వేస్తారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని వాదన ఇలా ఉండగా..
Read Also:Gold Rate Today: అయ్యబాబోయ్.. బెంబేలేత్తిస్తున్న బంగారం ధరలు! కొనడం కష్టమే ఇగ
కూరగాయలు అమ్మిన లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతుండటంతో మొత్తం టర్నోవర్ పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, కర్ణాటక జీఎస్టీ శాఖ ప్రకటించిన ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం అయ్యే టర్నోవర్ దాటి పోయిన చిన్న వ్యాపారులపై నిఘా పెడతామన్నారు. దీనితో వారు నోటీసులు పంపించడం ప్రారంభించారు. ఈ దెబ్బతో ఇప్పుడు ఆ ప్రాంతంలో చాలా మంది చిన్న వ్యాపారులు యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్లు ఆపివేసి కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే, కేవలం క్యాష్ తీసుకుంటూ డిజిటల్ లావాదేవీలను తప్పించుకుంటున్నారని మాకు తెలిసిందని.. అయినా సరే, జీఎస్టీ అంటే మొత్తం టర్నోవర్పై పన్ను అని జీఎస్టీ శాఖ స్పష్టం చేసింది. నగదు లేదా యూపీఐ వేరు కాదు. ఎవరైనా ఆదాయాన్ని దాచే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం అని జీఎస్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!