Pawan Kalyan vs Vanga Geetha: పిఠాపురంలో గెలుపెవరిది..? పవన్ కల్యాణ్ vs వంగా గీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan vs Vanga Geetha: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి.. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే.. మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వడపోతల్లో నిమగ్నమయ్యాయి.. ఇక, టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల ప్రచారాన్ని ప్రారంభించారు.. పార్టీ కేడర్ గ్రామాలను చుట్టేస్తున్నారు.. అయితే, ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. దీనిక ప్రధాన కారణం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ప్రధాన కారణం.
Read Also: The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది.. ఒకప్పుడు జమిందారులు పాలించిన పిఠాపురం సంస్థానం.. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచిపోషించి ప్రత్యేకతను చాటుకుంది.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో పిఠాపురం పోరు ఉత్కంఠరేపుతోంది. 1955లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది. 1978 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు.. 1978లో కాంగ్రెస్ తరుపున కొప్పున మోహన్రావు గెలిస్తే.. 1983లో తెలుగుదేశం వేవ్లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ నుంచి కొప్పన మోహనరావు, 1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు.. 2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే, నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలవడంతో ఈ సారి గెలుపు పవన్ కల్యాణ్దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతీ ఎన్నికల్లో విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది..
Read Also: Andhra Pradesh: వరుడి బాగోతం బట్టబయలు.. పీటల మీద ఆగిన పెళ్లి..
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా? అసలు పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో.. తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్చేయండి..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!