Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-BLA: బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ ఆపరేషన్లలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు, అలాగే మూడు మంది BLA కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సంస్థ వెల్లడించింది. పంజ్గూర్లో ప్రభుత్వ భవనాలను ఆక్రమించామని, రేకో డిక్ ప్రాజెక్ట్కు సంబంధించిన వాహనాల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్నామని BLA పేర్కొంది.
Winter Tea Benefits: రోజూ టీ తాగడం వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
BLA ప్రతినిధి జైద్ బలూచ్ తెలిపిన వివరాల ప్రకారం.. సున్నీ, క్వెట్టా, కేచ్, పంజ్గూర్, బులేదా ప్రాంతాల్లో విడివిడిగా జరిగిన దాడుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో ఆయుధాలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాలపై నియంత్రణ కూడా సాధించినట్లు ఆయన చెప్పారు. వేర్వేరు ఎదురుకాల్పుల్లో ముగ్గురు BLA కమాండర్లు మరణించినట్లు వెల్లడించారు. సమాచారం మేర BLA కమాండర్లు పంజ్గూర్ పట్టణంలోని ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకుని, నగరంలోని పలు ప్రాంతాల్లో మోహరించారు. ఈ చర్యలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం.
కలాత్ మిడ్వే వద్ద రేకో డిక్ ఖనిజ ప్రాజెక్ట్కు సంబంధించిన వాహనాల కాన్వాయ్ను BLA లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్లో మూడు వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలిపింది. కాన్వాయ్కు భద్రత కల్పిస్తున్న పాకిస్తాన్ సైనికులకు కూడా నష్టం జరిగినట్లు పేర్కొంది. ఎదురుకాల్పుల్లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD)కు చెందిన ఒక అధికారి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు BLA వర్గాలు వెల్లడించాయి. సుమారు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో నియంత్రణ కొనసాగించిన అనంతరం, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం తమ బలగాలు సురక్షితంగా వెనుదిరిగాయని తెలిపింది.
డిసెంబర్ 13న బులేదా ప్రాంతంలోని మినాజ్ ఏరియాలో పాకిస్తాన్ సైన్యానికి రేషన్ తీసుకెళ్తున్న వాహనాలను BLA తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. డ్రైవర్లను హెచ్చరించి వదిలిపెట్టామని, అయితే ఆక్రమణలో ఉన్న సైన్యానికి రేషన్ లేదా ఇతర సరుకులు సరఫరా చేయడం ప్రత్యక్షంగా సహకరించినట్లేనని హెచ్చరించారు. ఈ విధమైన కార్యకలాపాల్లో పాల్గొనే వారిని లక్ష్యంగా చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి దీనిపై అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!