Kribhco Chairman: ‘క్రిబ్కో’ ఛైర్మన్గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి!
- క్రిబ్కో ఛైర్మన్గా తెలుగు వ్యాపారవేత్త
- ఏకగ్రీవంగా ఎన్నికైన వల్లభనేని సుధాకర్ చౌదరి
- మోహన్ స్పింటెక్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిబ్కో (క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్) నూతన ఛైర్మన్గా తెలుగు వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. మొన్నటివరకు వైస్ ఛైర్మన్గా ఉన్న సుధాకర్ చౌదరి.. సోమవారం జరిగిన క్రిబ్కో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలానే డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ రెండు అత్యున్నత పదవులకు ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో.. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నూతన ఛైర్మన్ సుధాకర్ చౌదరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎరువులు, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడంలో సుధాకర్ చౌదరి, చంద్రపాల్ సింగ్ యాదవ్ విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఎస్సీయూఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం గమనార్హం. బోర్డు సభ్యులు, ఇద్దరు మంత్రుల మధ్య చర్చల తర్వాత నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్, ఉత్తరప్రదేశ్ సహకార మంత్రి జెపిఎస్ రాథోడ్ రెండు నామినేషన్లకు ఆమోదం తెలిపారు. వైస్ చైర్మన్ పదవికి గుజరాత్కు చెందిన మగన్భాయ్ పటేల్, బిపిన్ పటేల్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే బిపిన్ చివరికి చంద్రపాల్ యాదవ్ను సిఫార్సు చేశారు. దాంతో వైస్ చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం అయింది.
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
Also Read: OnePlus 15: ఐఫోన్ 17 సిరీస్కు పోటీ.. ‘వన్ప్లస్ 15’ ఫీచర్స్ లీక్! సూపర్ డిజైన్, బిగ్ బ్యాటరీ
వల్లభనేని సుధాకర్ చౌదరి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. విజయవాడలోని ఎస్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో (1978–1986) పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబుజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ (1989–1993) నుంచి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఆయన నాయకత్వంలో మోహన్ స్పింటెక్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వస్త్ర తయారీ కంపెనీగా ఎదిగింది. వస్త్ర పరిశ్రమ, సహకార రంగాలలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సుధాకర్ చౌదరి ఫిబ్రవరి 2020 నుంచి క్రిబ్కోలో డైరెక్టర్గా ఉన్నారు. క్రిబ్కో ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆడిట్ కమిటీ సభ్యుడు కూడా. క్రిబ్కో ఏప్రిల్ 1980లో స్థాపించబడిన రసాయన ఎరువుల ఉత్పత్తి సంస్థ.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!