V. Hanumantha Rao : తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు… ఒక్కటీ నెరవేర్చలేదు
20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని, రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, నెరవేర్చలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నాడని, కేసీఆర్ ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేశారని ఆయన విమర్శించారు. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందని, తెలంగాణలో వున్న వారికి పరిహారం ఇవ్వకుండా పంజాబ్, బీహార్ వారికి డబ్బులు కేసీఆర్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
Also Read : Andhra Pradesh: పసికందు ప్రాణం తీసిన మద్యం మత్తు..దారుణం..
Also Read
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, పేద ప్రజలపై మోదీకి ప్రేమ లేదని, బండారు దత్తాత్రేయ తెలంగాణ కోసం పోరాడితే నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేంద్రం పిలవలేదన్నారు వీహెచ్. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కేసీఆర్ బీసీ బంధు అని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,మైనారిటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి
Also Read : Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
అంతేకాకుండా.. ‘ మాటలు చెప్పే మోడీ, కేసీఆర్ ను ఓడించాలి. అనేకమంది పిల్లలు ఐఐటీ, ఐ.ఐ.ఎం చదవడానికి కాంగ్రెస్ కారణం. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటి…? కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశాము. 1993 లో మండల్ కమీషన్ వచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్ లో ఎవరైనా చేరవచ్చు కానీ ఐదేళ్ల వరకు పదవులు ఇవ్వవద్దు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో చెప్పారు. ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే ప్రభావం వుంటుంది’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!