Great-Grandmother Goes To School: 92 ఏళ్ల వయస్సులో స్కూల్కు వెళ్తున్న బామ్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Great-Grandmother Goes To School: చదువుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ బామ్మ. ఇప్పటికే చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించి తమ కలను నెరవేర్చుకున్నారు. అలాంటి జాబితాలోకి చేరింది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 92 ఏళ్ల సలీమాఖాన్. 92 ఏళ్ల వయస్సులో ఈ బామ్మ స్కూల్కు వెళ్లి చదువుకుంటోంది. ఆమెను చూసి చాలామంది మహిళలు కూడా స్ఫూర్తి పొంది బడిబాట పట్టారు.
Also Read: Zealandia: ఖండాలు 7 కాదు 8.. 375 ఏళ్ల తర్వాత కనుగొన్న సైంటిస్టులు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
14 ఏళ్లకే పెళ్లయి, బ్రిటీష్ పాలనను తట్టుకుని ఇప్పుడు 92 ఏళ్ల వయసులో చిన్నతనంలో బడిలో చదవాలన్న కలను సలీమా ఖాన్ నెరవేర్చుకుంది. ఆమె ఇప్పుడు పాఠశాలకు వెళ్లి చిన్న పిల్లలతో కలిసి చదువుకుంటోంది. ఆమె ఒకటి నుంచి 100 వరకు లెక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె కథ వెలుగులోకి వచ్చింది. సలీమాఖాన్ 1931లో జన్మించారు. 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. భారతదేశంలో బ్రిటీష్ వలస పాలన ముగియడానికి రెండు సంవత్సరాల ముందు – చదవడం, రాయడం అనేది జీవితకాల కల. ఆ కల ఇప్పుడు నెరవేరింది. తనకు చదువు అంటే చాలా ఇష్టమని, నేను స్కూల్కి వెళ్తాను, ఇప్పుడు నోట్లు లెక్కపెట్టగలను అని సలీమా ఖాన్ చెప్పింది. ఓ మీడియా కథనం ప్రకారం.. ‘నోట్లను లెక్కించలేనందున మనవళ్లు ఎక్కువ డబ్బు ఇస్తానని మాయ చేసేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి’ అని సలీమా అంటోంది. చావలిలోని ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. “ఆమె పాఠశాలకు వచ్చి చదువుకుంటే, పింఛను అందజేస్తానని నేను ఆమెకు చెప్పాను, ఇది ఆమెకు స్ఫూర్తినిచ్చింది, ఇప్పుడు ఆమె 100 వరకు లెక్కించవచ్చు, ఆమె పేరు స్వయంగా రాయడం వచ్చు.” అని చెప్పారు.
Also Read: Korean: కొరియన్ మహిళల అందానికి సీక్రెట్ ఏంటో తెలుసా?
స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. సలీమా ఖాన్కు బోధించడానికి ఉపాధ్యాయులు మొదట్లో సంకోచించారని, అయితే ఆమెకు చదువుపై ఉన్న మక్కువ వారిని గెలిపించిందని చెప్పారు. సలీమా ఖాన్ తాను చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తనతో చేరడానికి ఇతరులను ప్రేరేపించింది. ఆమె పాఠశాలకు వెళ్ళినప్పటి నుండి, ఇద్దరు కోడళ్లతో సహా గ్రామానికి చెందిన 25 మంది మహిళలు అక్షరాస్యత తరగతులను కూడా ప్రారంభించారని ప్రతిభా శర్మచెప్పారు. స్థానిక విద్యాధికారి లక్ష్మీ పాండే ఆ బామ్మను ప్రశంసించారు. సలీమా ఖాన్ కథ అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలిపారు. జ్ఞానాన్ని సంపాదించేందుకు వయసుతో పనిలేదని ఆమె మరోసారి రుజువు చేసిందన్నారు.
92 ఏళ్ల సలీమా ఖాన్ పేరు అత్యంత వృద్ధాప్యంలో చదువు ప్రారంభించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయబడుతుందని తెలిసింది. ఎందుకంటే కెన్యాకు చెందిన దివంగత కిమానిన్గంగా మారుగే ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పూర్తి చేసిన అతి పెద్ద వ్యక్తిగా జాబితా చేయబడ్డారు. ఆమె 84 సంవత్సరాల వయస్సులో 2004లో స్కూల్లో చేరారు. ఇప్పుడు ఆమె కంటే ఎక్కువ వయస్సు గల 92 ఏళ్ల సలీమా ఖాన్ ఆ రికార్డును అధిగమించింది.
నవ్ భారత్ అక్షరాస్యత మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా 21,000 మందిని అక్షరాస్యులుగా మార్చాలనే జిల్లా లక్ష్యాన్ని బులంద్షహర్ ప్రాథమిక విద్యా అధికారి పంచుకున్నారు. ఇప్పటి వరకు సమీరన్ సహా 9,000 మంది అక్షరాస్యత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..