Uttam Kumar Reddy: రాజీ పడేదే లేదు.. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు
- కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు కోసం రాజీ లేదు
- ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వం
- 555 TMC నీరు కావాలని డిమాండ్
- కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ వాదనల వివరాలను వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే అంశాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ రాష్ట్ర వాటా విషయంలో రాజీ పడేది లేదని.. కృష్ణా, గోదావరి జలాల్లో తమ వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Most Wanted Criminal: పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. రంగంలోకి 10 టీమ్లు..
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ మూడు రోజుల పాటు వాదనలు వినిపిస్తున్నారు. కృష్ణా నది ప్రవాహం, క్యాచ్మెంట్ ఏరియా, జనాభా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకు 70 శాతం నీటి వాటా కేటాయించాలని కోరుతున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 TMCల నీటిని కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
PMUY Scheme: పేదలకు శుభవార్త.. కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు
గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తాము ఏకీభవించడం లేదని, అందుకే ఫైల్ రీఓపెన్ చేసి మొదటి నుంచి వాదనలను వినిపిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అండర్ సెక్షన్ 3 రిఫరెన్స్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఫిబ్రవరి నుంచి వాదనలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం తుది వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. ఈ వాదనలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికే బ్రీఫింగ్ జరిగిందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పూర్తిస్థాయిలో పోరాడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!