Uttam Kumar Reddy : ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు కొత్తగా సాగులోకి తీసుకు రాలేదన్నారు ఉత్తమ్. పదేళ్లు అధికారంలో ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలేదని, మేము కొంత బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నారు. రాజీవ్, ఇందిరా సాగర్ కలిసి 3505 కోట్లతో పూర్తి కావాల్సి ఉంటే 18286 కోట్లకు పెంచారు. అయినా 349 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటే ఇప్పుడు రెండింతలు పెరిగింది. భూసేకరణ కూడా పెరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 1500 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు ఉత్తమ్.
Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్ల ప్రయోగం
Also Read
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
- IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. 'వైభవ్' అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
అంతేకాకుండా..’రకరకాల సాకులతో ఆ ప్రాజెక్టులను వదిలి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. కమీషన్ల కక్కుర్తి వల్ల ఆ రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులు వదలి వేయబడ్డాయి. 2016లో 7926 కోట్లు జీవో ఇస్తే ఇప్పుడు సుమారు 19 వేల కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్. 39 శాతం మాత్రమే బీఆర్ఎస్ ఖర్చు చేసింది. cwc పూర్తి స్థాయి అనుమతులు సీతారామ ప్రాజెక్టుకు రాలేదు. Cwc అనుమతులు మేమే తెచ్చామని బీఆర్ఎస్ చెబుతున్నారు. జనవరి 5, 2024లో సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. మా కృషి వల్లే 65 టీఎంసీలకు త్వరలో అప్రూవల్ రాబోతుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కేటీఆర్ హైదరాబాద్ లో పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. తాము పూర్తి చేసిన పనులకు ktr నెత్తిన నీళ్లు పోసుకున్న ఫోటోలు ప్రదర్శించారు. హరీశ్.. ktr ను ఇరికించేందుకు నెత్తిన నీళ్లు పోసుకున్నారని వ్యాఖ్యానించి ఉండొచ్చు. సీతారామ ప్రాజెక్టు పంపులకు బీఆర్ఎస్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. సీతారామలో ప్యాకేజీ నంబర్ 8 పనుల నిర్ణయమే బిఆర్ఎస్ హయాంలో జరగలేదు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరి సిస్టమ్, కాల్వల కోసం భూసేకరణ చేయలేదు.’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
UP: వీళ్లు మనుషులేనా..! నమ్మి వచ్చిన ప్రియురాలిపై.. ప్రియుడు, తండ్రి దారుణం
తాజావార్తలు
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!