India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Iran Trade: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరిట తీవ్రమైన ఆర్థిక దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారం సాగిస్తున్న నాలుగు భారతీయ కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయ పౌరులపై వాషింగ్టన్ కఠిన ఆంక్షలు విధించింది. దాదాపు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ సంబంధిత లావాదేవీల ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2025 మధ్య ఇరాన్ నుంచి సుమారు 69 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నందుకు సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్పై ఆంక్షలు పడ్డాయి. గతంలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న బొంజోర్ కమోడిటీ ఎఫ్జెడ్ఈ సంస్థతో కూడా ఈ కంపెనీకి సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం దిగుమతులు చేసుకున్న ఆరోపణలతో పిపి సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతీస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీటికి తోడు ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసినందుకు కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టీస్ పార్ట్నర్స్పై, దాని భాగస్వాములు ఇద్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగీలతో పాటు పిపి సాఫ్ట్టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్లపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేందుకు తాము ఒక “ఆర్థిక డి-డే”ని ప్రారంభించామని, ఇరాన్ ప్రభుత్వ మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నామని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇరాన్తో ఎలాంటి ఆర్థిక బంధం కొనసాగించినా కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో కూడా ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధాలు ఉన్న పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఇటువంటి ఆంక్షలే విధించింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ చైనా, హాంకాంగ్లకు చెందిన దాదాపు 20 కంపెనీలు, నలుగురు వ్యక్తులతో కలిపి మొత్తం 60కి పైగా సంస్థలు, వ్యక్తులు, నౌకలపై ఈ ఆంక్షల వర్షం కురిపించింది. అయితే వాషింగ్టన్ చర్యలపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అమెరికా ఆంక్షలను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన “బహిరంగ బెదిరింపు చర్య”గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. తమ సార్వభౌమాధికారాన్ని, జాతీయ ప్రయోజనాలను గౌరవించే ఏ గౌరవప్రదమైన దేశం కూడా ఈ చట్టవ్యతిరేకమైన వేధింపులను అంగీకరించదని తేల్చిచెప్పింది. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి తమ వద్ద రెండేళ్ల వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే ప్రకటించారు. అలాగే అమెరికా చేస్తున్నది కేవలం గొప్పలు చెప్పుకోవడం అని, ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకునే స్థితిలో ఆ దేశం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బకర్ ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం కొనసాగిస్తున్న భాగస్వామ్య దేశాలు కూడా అమెరికా బెదిరింపులను తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు.
Also Read
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
తాజావార్తలు
-
India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!