H-1B Visa Delay: అమెరికా కల చెదిరింది.. 2027 వరకు హెచ్-1బి వీసా కోసం ఆగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa Delay: భారతదేశం అంతటా ఉన్న యూఎస్ కాన్సులేట్లు H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ తేదీలను 2027 కి పోస్ట్పోన్ చేశాయి. ఈ నిర్ణయం యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని యూఎస్ వీసా కార్యాలయాలు ఇకపై రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లను అందుబాటులో ఉంచడం లేదు. నిజానికి డిసెంబర్ 2025లో కాన్సులేట్లు ఆ నెలలో జరగాల్సిన నియామకాలను మార్చి 2026కి మార్చడంతో ఈ జాప్యం మొదలైంది. ఆ ఇంటర్వ్యూలను అధికారులు అక్టోబర్ 2026కి మార్చారు, ఇప్పుడు ఏకంగా 2027కి పోస్ట్పోన్ చేశారు.
READ ALSO: T20 World Cup: పాక్ కొత్త డ్రామా.. టీ20 వరల్డ్ కప్లో భారత్లో జరిగే మ్యాచ్ల బహిష్కరణ.. కానీ..!
Also Read
US H-1B ప్రోగ్రామ్ను పునర్నిర్మించడంతో ఈ పెండింగ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 29, 2025న, US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ 2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త నియమాలను వెల్లడించింది. 85 వేల వీసాల వార్షిక పరిమితి మారలేదు, ఇందులో US పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న దరఖాస్తుదారులకు 20 వేలు రిజర్వు చేశారు. అలాగే విధానపరమైన మార్పులు కూడా మందగమనానికి దారితీశాయి. డిసెంబర్ 15, 2025న, ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తుదారులకు తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్ను అమెరికా ప్రవేశపెట్టింది. ఈ అదనపు స్క్రూటినీ ప్రతి దరఖాస్తుదారునికి ప్రాసెసింగ్ సమయాన్ని పెంచింది, దీంతో కాన్సులేట్లు ప్రతిరోజూ నిర్వహించగల ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించింది. అలాగే భారత పౌరులు మూడవ దేశాలలో వీసా స్టాంపింగ్ పొందేందుకు అనుమతించే ఎంపికను కూడా అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఇది వీసా మంజూరుకు మరింత ఆలస్యం చేసింది.
కొత్త వ్యవస్థ కింద, USCIS లాటరీలో జీతం, అనుభవ స్థాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. లెవల్ IV కార్మికుల కోసం పిటిషన్లు దాఖలు చేసే యజమానులు నాలుగు లాటరీ ఎంట్రీలను, లెవల్ III కార్మికులకు మూడు, లెవల్ II కార్మికులకు రెండు, లెవల్ I కార్మికులకు ఒకటి అందుకుంటారు. ఈ లాటరీ మార్చి ప్రారంభంలో ప్రారంభమవుతుంది. నిజానికి US యజమానులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ కంపెనీలు, ఆరోగ్య, విద్యా సంస్థలు ప్రత్యేక పదవుల కోసం H-1B నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలతో సహా మరికొన్ని కంపెనీలు నష్ట నివారణ చర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి అమెరికన్ పౌరుల నియామకాన్ని పెంచాయి.
READ ALSO: Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!