H-1B Visa Delay: అమెరికా కల చెదిరింది.. 2027 వరకు హెచ్-1బి వీసా కోసం ఆగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa Delay: భారతదేశం అంతటా ఉన్న యూఎస్ కాన్సులేట్లు H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ తేదీలను 2027 కి పోస్ట్పోన్ చేశాయి. ఈ నిర్ణయం యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని యూఎస్ వీసా కార్యాలయాలు ఇకపై రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లను అందుబాటులో ఉంచడం లేదు. నిజానికి డిసెంబర్ 2025లో కాన్సులేట్లు ఆ నెలలో జరగాల్సిన నియామకాలను మార్చి 2026కి మార్చడంతో ఈ జాప్యం మొదలైంది. ఆ ఇంటర్వ్యూలను అధికారులు అక్టోబర్ 2026కి మార్చారు, ఇప్పుడు ఏకంగా 2027కి పోస్ట్పోన్ చేశారు.
READ ALSO: T20 World Cup: పాక్ కొత్త డ్రామా.. టీ20 వరల్డ్ కప్లో భారత్లో జరిగే మ్యాచ్ల బహిష్కరణ.. కానీ..!
Also Read
- Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
US H-1B ప్రోగ్రామ్ను పునర్నిర్మించడంతో ఈ పెండింగ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 29, 2025న, US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ 2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త నియమాలను వెల్లడించింది. 85 వేల వీసాల వార్షిక పరిమితి మారలేదు, ఇందులో US పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్న దరఖాస్తుదారులకు 20 వేలు రిజర్వు చేశారు. అలాగే విధానపరమైన మార్పులు కూడా మందగమనానికి దారితీశాయి. డిసెంబర్ 15, 2025న, ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తుదారులకు తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్ను అమెరికా ప్రవేశపెట్టింది. ఈ అదనపు స్క్రూటినీ ప్రతి దరఖాస్తుదారునికి ప్రాసెసింగ్ సమయాన్ని పెంచింది, దీంతో కాన్సులేట్లు ప్రతిరోజూ నిర్వహించగల ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించింది. అలాగే భారత పౌరులు మూడవ దేశాలలో వీసా స్టాంపింగ్ పొందేందుకు అనుమతించే ఎంపికను కూడా అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఇది వీసా మంజూరుకు మరింత ఆలస్యం చేసింది.
కొత్త వ్యవస్థ కింద, USCIS లాటరీలో జీతం, అనుభవ స్థాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. లెవల్ IV కార్మికుల కోసం పిటిషన్లు దాఖలు చేసే యజమానులు నాలుగు లాటరీ ఎంట్రీలను, లెవల్ III కార్మికులకు మూడు, లెవల్ II కార్మికులకు రెండు, లెవల్ I కార్మికులకు ఒకటి అందుకుంటారు. ఈ లాటరీ మార్చి ప్రారంభంలో ప్రారంభమవుతుంది. నిజానికి US యజమానులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ కంపెనీలు, ఆరోగ్య, విద్యా సంస్థలు ప్రత్యేక పదవుల కోసం H-1B నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలతో సహా మరికొన్ని కంపెనీలు నష్ట నివారణ చర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి అమెరికన్ పౌరుల నియామకాన్ని పెంచాయి.
READ ALSO: Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్గా తీసుకున్నా: హీరో విశ్వక్సేన్
తాజావార్తలు
-
Reliance AGM 2026: జియో IPO నుంచి AI, 2 లక్షల ఉద్యోగాల వరకు.. ముఖేష్ అంబానీ 10 కీలక ప్రకటనలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!