T20 World Cup: పాక్ కొత్త డ్రామా.. టీ20 వరల్డ్ కప్లో భారత్లో జరిగే మ్యాచ్ల బహిష్కరణ.. కానీ..!
- పాకిస్తాన్ కొత్త డ్రామా..
- T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించిన ఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ తొలగింపు.. స్కాట్లాండ్కు అవకాశం
2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 24 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం కల్పించింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఐసీసీ నిర్ణయంపై పీసీబీ అసంతృప్తి
బంగ్లాదేశ్ తొలగింపుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే టోర్నమెంట్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించిన విషయం తెలిసిందే. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాకిస్తాన్, నిశ్శబ్దంగా టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది.
భారత్తో మ్యాచ్కు బహిష్కరణ?
అయితే పాకిస్తాన్ డ్రామా ఇక్కడితో ముగియలేదు. జియో సూపర్ కథనం ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్తో జరిగే గ్రూప్ మ్యాచ్ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ను తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్.. భారత్తో మ్యాచ్ ఆడకపోతే రెండు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, ఐసీసీ ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు
పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టుతో సమావేశం నిర్వహించి వ్యూహం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. సమాఖ్య ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రస్తుతం దేశంలో లేరు. ఆయన తిరిగివచ్చిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాం అని నఖ్వీ చెప్పారు. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. ఐసీసీ నిర్ణయంలో బీసీసీఐ ప్రభావం ఉందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో
ఫిబ్రవరి 7: నెదర్లాండ్స్
ఫిబ్రవరి 10: అమెరికా
ఫిబ్రవరి 15: భారత్త
ఫిబ్రవరి 18: నమీబియాతో తలపడనున్నాయి..
గ్రూప్ మ్యాచ్లన్నీ కొలంబోలో జరగనున్నాయి. సూపర్-8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు, సెమీ ఫైనల్స్ మార్చి 3, 5 తేదీల్లో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు. ఇక, టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న బాబర్ ఆజం కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. షాదాబ్ ఖాన్, ఖవాజా నఫాయ్, ఉస్మాన్ తారిక్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే హారిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి అనుభవజ్ఞులు ఈసారి జట్టుకు దూరమయ్యారు.
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!