T20 World Cup: పాక్ కొత్త డ్రామా.. టీ20 వరల్డ్ కప్లో భారత్లో జరిగే మ్యాచ్ల బహిష్కరణ.. కానీ..!
- పాకిస్తాన్ కొత్త డ్రామా..
- T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించిన ఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ తొలగింపు.. స్కాట్లాండ్కు అవకాశం
2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 24 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం కల్పించింది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
ఐసీసీ నిర్ణయంపై పీసీబీ అసంతృప్తి
బంగ్లాదేశ్ తొలగింపుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే టోర్నమెంట్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించిన విషయం తెలిసిందే. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాకిస్తాన్, నిశ్శబ్దంగా టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది.
భారత్తో మ్యాచ్కు బహిష్కరణ?
అయితే పాకిస్తాన్ డ్రామా ఇక్కడితో ముగియలేదు. జియో సూపర్ కథనం ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్తో జరిగే గ్రూప్ మ్యాచ్ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ను తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్.. భారత్తో మ్యాచ్ ఆడకపోతే రెండు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, ఐసీసీ ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు
పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టుతో సమావేశం నిర్వహించి వ్యూహం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. సమాఖ్య ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రస్తుతం దేశంలో లేరు. ఆయన తిరిగివచ్చిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాం అని నఖ్వీ చెప్పారు. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. ఐసీసీ నిర్ణయంలో బీసీసీఐ ప్రభావం ఉందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో
ఫిబ్రవరి 7: నెదర్లాండ్స్
ఫిబ్రవరి 10: అమెరికా
ఫిబ్రవరి 15: భారత్త
ఫిబ్రవరి 18: నమీబియాతో తలపడనున్నాయి..
గ్రూప్ మ్యాచ్లన్నీ కొలంబోలో జరగనున్నాయి. సూపర్-8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు, సెమీ ఫైనల్స్ మార్చి 3, 5 తేదీల్లో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు. ఇక, టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న బాబర్ ఆజం కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. షాదాబ్ ఖాన్, ఖవాజా నఫాయ్, ఉస్మాన్ తారిక్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే హారిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి అనుభవజ్ఞులు ఈసారి జట్టుకు దూరమయ్యారు.
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?