UP CM Yogi Adityanath: వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు..
- లక్నోలో బీజేపీ కార్యక్రమంలో సీఎం యోగి తీవ్ర విమర్శలు
- ముర్షిదాబాద్ హత్యలను ప్రస్తావించిన సీఎం యోగి
- వక్ఫ్ భూములు పేదలకు ఉపయోగపడతాయని యోగి
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్షాప్లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
READ MORE: Violence : బాలుడిపై ఉపాధ్యాయుడి దౌర్జన్యం.. 1వ తరగతి విద్యార్థిని తీవ్రంగా కొట్టిన టీచర్
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
“వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తు్న్నారు. ముర్షిదాబాద్లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారు. ఇంతకీ ఈ ఉదంతానికి ఒడిగట్టిన వ్యక్తులు ఎవరు? వక్ఫ్ భూమి ప్రయోజనం పొందబోయే వాళ్లు ముస్లిం వర్గానికి చెందిన దళితులు, అణగారిన వర్గాల వారే. ఈ భూమి తిరిగి రెవెన్యూ రికార్డుల్లోకి వస్తే.. పేదవాడికి కూడా ఎత్తైన భవనానంలో మంచి ఫ్లాట్ వస్తుంది. పేదలకు మంచి ఫ్లాట్లు వస్తే తమ ఓటు బ్యాంకు పోతుందని విపక్షాలు భయపడుతున్నాయి. అందుకే వీళ్లు హింసను ప్రేరేపిస్తున్నారు.” అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth Reddy : అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి..
సీఏఏ గురించి ముఖ్యమంత్రి ఆధిత్యానాథ్ ప్రస్తావించారు. “ప్రపంచంలోని ఏ దేశంలో అయిన హిందువులు హింసకు గురైతే వాళ్లు భారత్కు వస్తారు. కానీ కాంగ్రెస్-ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు దీనికి ఎల్లప్పుడూ అడ్డంకులు సృష్టిస్తాయి. వీళ్లని ఈ పార్టీలు శరణార్థులుగా ఉంచాయి. కానీ బీజేపీ వారిని దత్తత తీసుకుంది. ఈ వక్ఫ్ చట్టం వల్ల వచ్చే భూమి పేదలకు ఆసుపత్రులను అందిస్తుంది. మంచి వైద్య కళాశాలలు నిర్మిస్తారు. మంచి విద్యా కేంద్రాలు సృష్టించబడతాయి. పేద పిల్లలకు చదువుకోవడానికి మంచి సౌకర్యాలు లభిస్తాయి. విపక్షాల ఓటు బ్యాంకు విచ్ఛిన్నమవుతుంది. అందుకే వీళ్లు ఇలాంటి హింసను ప్రేరేపిస్తున్నారు.” అని సీఎం యోగి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?