Kishan Reddy: ఖైరతాబాద్ బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో అందరికీ శుభం కలగాలని, భగవంతుడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
READ ALSO: Revanth Reddy: కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం రావాలి!
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు. తాను ప్రజలను కోరేది ఒకటే అని.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని, ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా, ప్రపంచంలో భారత్ విశ్వగురువుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో మౌలిక వసతుల కల్పన, పేద ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశీ, ఆర్థిక, జీఎస్టీ సంస్కరణలు, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. తెలంగాణకు 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ చాలా ముఖ్యమైనవి అని, అయితే ప్రస్తుతం ఈ రెండింటికి నిధుల కొరత ఉందని అన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో పాదయాత్ర చేసి, తెలుసుకున్న సమస్యలను జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే సాయంత్రం లోపు పరిష్కరించేవారని, ఇప్పుడు సాయంకాలం లోపు కాదు కదా సంవత్సరం గడిచిన సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చేస్తానన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇచ్చిన భయపడాల్సిన అవసరం లేదని, స్థానికులకు తాను అండగా ఉంటానని అన్నారు.
READ ALSO: Allu Arjun: స్టాఫ్తో కలిసి ఐకాన్ స్టార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!