Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddy Fires On Congress Over Manmohan Singh Incident

Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..

Published Date :December 30, 2024 , 4:03 pm
By Rajesh Veeramalla
  • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది- కిషన్ రెడ్డి
  • మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు- కిషన్ రెడ్డి
  • మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు- కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనం- కిషన్ రెడ్డి.
Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు. వాజ్ పెయి అంత్యక్రియలు ఎలా జరిగాయో.. అలానే మన్మోహన్ సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ బాధ్యతలను అమిత్ షా కి అప్పగించారని తెలిపారు. అంతేకాకుండా.. స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. బోర్ల పడడం పరిపాటి అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

Read Also: Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!

నెహ్రూ కుటుంబం మొదటి నుండి.. ఆ కుటుంబానికి చెందని వారు ప్రధాని అయినా, రాష్ట్రపతి అయిన అవమానించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్‌ను ఎన్ని సార్లు అవమానించి అగౌరవ పరిచారోనని పేర్కొన్నారు. ఆర్డినెన్సును చింపిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దొంగ ప్రేమను ఒలక బోస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అహంకారపూరిత దివాలాకోరు తనాన్ని దేశ మేధావులు ఖండిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. 2జి కుంభకోణానికి కారణం మన్మోహన్ సింగ్ ఆలోచనలకి విరుద్ధంగా సోనియా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. తమ కనుసన్నల్లో పని చేయాలని భావనతో సోనియా, రాహుల్ ఉండే వారని.. బలవంతంగా సంతకాలు పెట్టించారని కిషన్ రెడ్డి తెలిపారు. సోనియా, రాహుల్‌లు షాడో పీఎంలుగా వ్యవహరించారని అన్నారు.

Read Also: Bandi Sanjay: తెలంగాణ సీఎంను పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుపట్టిన కేంద్రమంత్రి..

కుంభకోనాలన్నింటికి కారణం సోనియా గాంధీ.. కానీ మన్మోహన్ సింగ్‌కి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పీవీ నరసింహా రావును కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. ఒక కాంగ్రెస్ నేతకు దక్కిన గౌరవాన్ని కూడా ఆయనకి ఇవ్వలేదు.. ఏఐసీసీ కార్యాలయంలోకి ఆయన పార్థివ శరీరాన్ని రానివ్వలేదు.. ఆఫీస్‌కు తాళాలు వేశారని కిషన్ రెడ్డి తెలిపారు. అంత్యక్రియలు ఢిల్లీలో జరపనీయలేదు.. బలవంతంగా హైదరాబాద్‌కు పంపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పీవీకి స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదని అన్నారు. 2015లో మోడీ ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక కేంద్రంను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాన మంత్రుల సంగ్రహాలయాన్ని మోడీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ క్షమించరని కిషన్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fires On Congress
  • Kishan Reddy
  • Manmohan Singh Incident
  • telugu news

తాజావార్తలు

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions