Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది- కిషన్ రెడ్డి
- మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు- కిషన్ రెడ్డి
- మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు- కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనం- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు. వాజ్ పెయి అంత్యక్రియలు ఎలా జరిగాయో.. అలానే మన్మోహన్ సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ బాధ్యతలను అమిత్ షా కి అప్పగించారని తెలిపారు. అంతేకాకుండా.. స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. బోర్ల పడడం పరిపాటి అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!
Also Read
- Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
నెహ్రూ కుటుంబం మొదటి నుండి.. ఆ కుటుంబానికి చెందని వారు ప్రధాని అయినా, రాష్ట్రపతి అయిన అవమానించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ను ఎన్ని సార్లు అవమానించి అగౌరవ పరిచారోనని పేర్కొన్నారు. ఆర్డినెన్సును చింపిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దొంగ ప్రేమను ఒలక బోస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అహంకారపూరిత దివాలాకోరు తనాన్ని దేశ మేధావులు ఖండిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. 2జి కుంభకోణానికి కారణం మన్మోహన్ సింగ్ ఆలోచనలకి విరుద్ధంగా సోనియా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. తమ కనుసన్నల్లో పని చేయాలని భావనతో సోనియా, రాహుల్ ఉండే వారని.. బలవంతంగా సంతకాలు పెట్టించారని కిషన్ రెడ్డి తెలిపారు. సోనియా, రాహుల్లు షాడో పీఎంలుగా వ్యవహరించారని అన్నారు.
Read Also: Bandi Sanjay: తెలంగాణ సీఎంను పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుపట్టిన కేంద్రమంత్రి..
కుంభకోనాలన్నింటికి కారణం సోనియా గాంధీ.. కానీ మన్మోహన్ సింగ్కి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పీవీ నరసింహా రావును కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. ఒక కాంగ్రెస్ నేతకు దక్కిన గౌరవాన్ని కూడా ఆయనకి ఇవ్వలేదు.. ఏఐసీసీ కార్యాలయంలోకి ఆయన పార్థివ శరీరాన్ని రానివ్వలేదు.. ఆఫీస్కు తాళాలు వేశారని కిషన్ రెడ్డి తెలిపారు. అంత్యక్రియలు ఢిల్లీలో జరపనీయలేదు.. బలవంతంగా హైదరాబాద్కు పంపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పీవీకి స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదని అన్నారు. 2015లో మోడీ ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక కేంద్రంను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాన మంత్రుల సంగ్రహాలయాన్ని మోడీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ క్షమించరని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..