Union Minister Kishan Reddy comments on Telangana budget: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇందులో ఉన్నవన్నీ అబద్ధాలేనని, అవాస్తవ లెక్కలేనని, అమలు కానీ వాగ్దాలేనని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తెలంగాణ బడ్జెట్పై కిషన్ రెడ్డి స్పందించారు. అడ్వయిర్టయిజ్మెంట్, పబ్లిసిటీ కోసం 575 శాతం పెంపుతో రూ.1000 కోట్లను కుటుంబ ప్రభుత్వం కేటాయించిందని విమర్శించారు. పేదలకు భరోసాను ఇచ్చే ‘ఆరోగ్య శ్రీ’ పథకానికి కూడా దాదాపుగా అంతే మొత్తాన్ని కేటాయించడం దారుణమన్నారు.
Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టుకి స్టేట్ ఫెస్టివల్ హోదా
భారీ బడ్జెట్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం డాంభికాలు పలుకుతోందని.. వాస్తవానికి సవరించిన అంచనాలు తగ్గిపోయాయనన్నారు. కేటాయింపుల్లో ఖర్చుచేసేది చాలా తక్కువే అని విమర్శించిన ఆయన.. ఇదీ బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లకున్న చరిత్ర అని ఆరోపించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగిందని, ఇలాంటి గిమ్మిక్కులతో ఫలితం లేదని ప్రజలకు అర్థమైందన్నారు. ఇలాంటి బడ్జెట్ను చూసి ప్రజలు విసుగుచెందుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.