Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Bhupathi Raju Srinivasa Varma Spoke On Tirumala Laddu Controversy

Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Published Date :September 28, 2024 , 4:44 pm
By Mahesh Jakki
  • లడ్డు వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
  • లడ్డూ విషయంలో కేంద్రం కూడా సీరియస్‌గా ఉందని వెల్లడి
  • అవసరమైతే విచారణలో కేంద్రం కూడా పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యలు
Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ రోజురోజుకీ దిగజారిందని విమర్శించారు. అంతర్వేది రథం తగలబెట్టడం సహా అనేక ఘటనల్లో నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదన్నారు. కల్తీ నెయ్యి అంశం నిజమని, టెస్టు రిపోర్టులు వచ్చాయన్నారు. మీ తండ్రి సైతం ఏడు కొండలను రెండు కొండలుగా చేయాలని చేసిన ప్రయత్నం అందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు. తిరుమలలో దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించాలని, కానీ మీరు ఒక్కరే వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీయలేదా అంటూ ప్రశ్నించారు. మీ సతీమణికి అభ్యంతరం ఉంది కాబట్టి గుడికి రాలేదని, కానీ దంపతులు ఇవ్వాల్సిన చోట ఒక్కరే ఇవ్వడం శాస్త్ర విరుద్ధమన్నారు. అలాగే డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వెళ్ళడం కూడా నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. మీ హయాంలో టీటీడీ పాలక వర్గానికి మీరు ఇచ్చిన విలువ ఏంటో అందరికీ తెలుసన్నారు. చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని రెండు సార్లు ఛైర్మన్‌ను చేసి కుటుంబ గుత్తాధిపత్యం ప్రదర్శించారన్నారు. లడ్డుపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని.. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.లడ్డు విషయంలో కేంద్రం కూడా సీరియస్‌గా ఉందని.. అవసరమైతే విచారణలో కేంద్రం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

Read Also: RK Roja: జగన్ దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు..

Also Read

  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం

విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదన్నారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రత, సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని దృష్టికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని, ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలని ఆలోచన చేస్తున్నామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయన్నారు.

Read Also: Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

అవసరం లేకపోయినా విస్తృతపరచడం, గత పాలకుల నిర్ణయాలు, రాయబరేలిలో పరిశ్రమలు పెట్టడం, వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్రం సాయం చేస్తూ పరిశ్రమను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇది ప్రజా ధనం.. నష్టాల్లో ఉన్న పరిశ్రమ కోసం నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక మంత్రికి స్టీల్ ప్లాంట్‌పై అవగాహన ఉందన్నారు. సెయిల్, ఎన్‌ఎండీసీ అధికారులతో సమావేశం అయ్యామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయన్నారు. కొన్ని అంశాలపై చర్చించామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను విలీనం చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటాయని.. వాటిని అధిగమించాలనే అంశంపై సెయిల్ అధికారులతో చర్చ జరిపామన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ దగ్గర అదనంగా ఉన్న భూమి 1500 ఎకరాల భూమిని ఎన్‌ఎండీసీకి ఇచ్చి ఆర్ధిక సహకారం, పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఎన్‌ఎండీసీ సంస్థతో చర్చించామన్నారు.

కార్మికులు ఆందోళన చెందడం సహజమేనని.. సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు, కార్మికులను తప్పు పట్టడం లేదన్నారు. ఉత్పత్తి ఎంత, కార్మికులు ఎంత అన్న సమాచారం తీసుకున్నామన్నారు. మిగతా సంస్థలతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎక్కువ ఉన్నారని.. ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. కార్మికులను బాధ్యులను చేయలేమన్నారు. సమర్ధవంతమైన అధికారులను నియమించామన్నారు. పనిలేనప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదన్నారు. నష్టాలు భరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Bhupathi Raju Srinivasa Varma
  • latest news
  • telugu news
  • Tirumala Laddu Controversy

తాజావార్తలు

  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?

  • Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?

  • Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్‌డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?

  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..

  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions