Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
- సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు
- ఆరోపణ నిజమైతే సీబీఐ విచారణకు సూచించాలి
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్ ప్రజలపై పడకూడదని ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి జగన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటికైన దిగజారతాడని విమర్శించారు. చంద్రబాబు ఆడిన అబద్ధాలను నిజం చేయడానికి పడుతున్న తపన చూస్తుంటే జాలి వేస్తుందన్నారు.
Read Also: AP CM Chandrababu: జగన్ అబద్ధపు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి..
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
మీ ఆరోపణ నిజమైతే సీబీఐ విచారణ వేయమని కేంద్రానికి లెటర్ రాయాలని పేర్కొన్నారు. మీకు దమ్ము, ధైర్యం వుంటే కమిటీ వేయమని హైకోర్టులో అఫిడవిట్ వేయాలన్నారు. రాజకీయాల కోసం ఇలాంటి నీచ ఆలోచనలు ఎలా చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో 4వేల ఉద్యోగాలు తీసే పరిస్థితి వచ్చిందని.. దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి అడుగులు వేయడం మానేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఈ 100 రోజుల్లో 27వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని.. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలకు అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలు ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయాలన్నారు. సీబీఐ గాని, హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని ఎంక్వైరీ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు దమ్ముంటే నిరూపించాలని బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు.
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?