Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..
- 2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది
- నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నది- అమిత్ షా
- ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి- అమిత్ షా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రభావం నుండి విముక్తి పొందాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Read Also: Tragedy: స్కూల్ క్యాంపస్లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం నక్సల్స్ వ్యతిరేక ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) క్యాంపును సందర్శించనున్నట్లు అమిత్ షా తెలిపారు. “నేను ఇలాంటి శిబిరాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, మా సమన్వయం మెరుగుపడింది.” అని అన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పురోగతి కోసం ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ.. ఈ సంవత్సరంలో 900 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 600 మందికి పైగా లొంగిపోయారు. ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా మరణించారని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Crime: భార్య గొంతు కోసి.. ఇంటికి నిప్పంటించిన భర్త.. మంటల్లో దూకి ఆత్మహత్య..
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. నక్సల్స్ కార్యకలాపాలు దాదాపు 70 శాతం తగ్గాయని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ వ్యవహారశైలిని పోలుస్తూ.. ‘మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు, దేశ భద్రత, గిరిజన వర్గాల అభివృద్ధి అంత ముఖ్యమైనవి కావు.’ అని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!