Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..
- 2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది
- నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నది- అమిత్ షా
- ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి- అమిత్ షా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రభావం నుండి విముక్తి పొందాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Read Also: Tragedy: స్కూల్ క్యాంపస్లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Also Read
ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం నక్సల్స్ వ్యతిరేక ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) క్యాంపును సందర్శించనున్నట్లు అమిత్ షా తెలిపారు. “నేను ఇలాంటి శిబిరాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, మా సమన్వయం మెరుగుపడింది.” అని అన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పురోగతి కోసం ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ.. ఈ సంవత్సరంలో 900 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 600 మందికి పైగా లొంగిపోయారు. ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా మరణించారని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Crime: భార్య గొంతు కోసి.. ఇంటికి నిప్పంటించిన భర్త.. మంటల్లో దూకి ఆత్మహత్య..
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. నక్సల్స్ కార్యకలాపాలు దాదాపు 70 శాతం తగ్గాయని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ వ్యవహారశైలిని పోలుస్తూ.. ‘మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు, దేశ భద్రత, గిరిజన వర్గాల అభివృద్ధి అంత ముఖ్యమైనవి కావు.’ అని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!