Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..
- 2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది
- నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నది- అమిత్ షా
- ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి- అమిత్ షా.
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రభావం నుండి విముక్తి పొందాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Read Also: Tragedy: స్కూల్ క్యాంపస్లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
ఛత్తీస్గఢ్లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం నక్సల్స్ వ్యతిరేక ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) క్యాంపును సందర్శించనున్నట్లు అమిత్ షా తెలిపారు. “నేను ఇలాంటి శిబిరాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, మా సమన్వయం మెరుగుపడింది.” అని అన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పురోగతి కోసం ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ.. ఈ సంవత్సరంలో 900 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 600 మందికి పైగా లొంగిపోయారు. ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా మరణించారని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Crime: భార్య గొంతు కోసి.. ఇంటికి నిప్పంటించిన భర్త.. మంటల్లో దూకి ఆత్మహత్య..
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. నక్సల్స్ కార్యకలాపాలు దాదాపు 70 శాతం తగ్గాయని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ వ్యవహారశైలిని పోలుస్తూ.. ‘మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు, దేశ భద్రత, గిరిజన వర్గాల అభివృద్ధి అంత ముఖ్యమైనవి కావు.’ అని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!