Union Budget 2026: వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ.. ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది.
ఈ బడ్జెట్ను మూడు ప్రధాన కర్తవ్యాల (Duties) ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానించడంతో పాటు.. యువత, పేదలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి వాటిని పొందుపరిచారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Union Budget 2026: రేర్ ఎర్త్ ఖనిజాలకు పెద్ద పీట.. సెమీ-కండక్టర్ ఇండస్ట్రీకి రూ. 40,000 కోట్లు..
దేశాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈసారి రికార్డు స్థాయిలో రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇది రూ. 11.2 లక్షల కోట్లుగా ఉండేది. మరోవైపు సెమీకండక్టర్ & టెక్నాలజీలో విప్లవం సృష్టించేలా ప్రకటన చేశారు. ఇందులో సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కింద చిప్ తయారీలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు రూ. 40,000 కోట్లు కేటాయించారు.
అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అలాగే పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేస్తూ కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్ను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో బయో ఫార్మా తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
Union Budget 2026: కాంచీవరం చీరలో నిర్మలా సీతారామన్.. 9 బడ్జెట్లు 9 రకాల చీరలు..
ఇక ఫార్మా విద్యా సంస్థలు సంబంధించి జాతీయ స్థాయిలో మూడు కొత్త ఫార్మా విద్యా, పరిశోధనా సంస్థలను స్థాపించనున్నారు. ఇంకా జౌళి రంగంలో ఉపాధి పెంచేందుకు మెగా పార్కుల ఏర్పాటుతో పాటు, అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఇంకా దేశంలో కొత్తగా మూడు ప్రపంచ స్థాయి రసాయన పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వీటితోపాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ స్థాపన ఏర్పాటు కానుంది. ముఖ్యంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే దిశగా కొత్త ఫైబర్ పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” మంత్రంతో 2025 ఆగస్టు తర్వాత ప్రభుత్వం 350కి పైగా సంస్కరణలు తీసుకువచ్చిందని, 7 శాతం వృద్ధి రేటుతో భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!