Union Budget 2025: భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు
- భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం తీసుక రాబోతున్న కేంద్ర సర్కార్
- AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు.
- AI అభివృద్ధికి రూ.500 కోట్ల కేటాయింపు.
Union Budget 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను (CoEs) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI పరిశోధనకు, విద్యా రంగంలో AI వినియోగాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల కోసం AI ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ అసెస్మెంట్లు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించేందుకు వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Also Read: Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
Also Read
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులను కేటాయించింది. ఈ చర్య ద్వారా అదనంగా 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్, విద్యా సదుపాయాలు అందించనుంది. IIT భిలాయ్, IIT ధార్వాడ్, IIT గోవా, IIT జమ్మూ, IIT తిరుపతి లాంటి ఐదింటికి ఈ విస్తరణ లభించనుంది. సాంకేతికత, AI, విద్య – ఈ మూడు రంగాల్లో అభివృద్ధి సాధించి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వ్యూహం ద్వారా AI పరిశోధనను వేగవంతం చేసి, దేశాన్ని AI రంగంలో అగ్రగామిగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: Railway Stocks: బడ్జెట్ సెషన్స్ వేళ లాభాల్లో రైల్వే స్టాక్స్..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. భారతదేశంలో AI ప్రతిభను పెంచేందుకు, పరిశోధన అవకాశాలను మెరుగుపర్చేందుకు, విద్యా వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత విద్యా వ్యవస్థలో AI వినియోగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు, దేశ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారబోతున్నాయి.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో