Union Budget 2025: భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు
- భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం తీసుక రాబోతున్న కేంద్ర సర్కార్
- AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు.
- AI అభివృద్ధికి రూ.500 కోట్ల కేటాయింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను (CoEs) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI పరిశోధనకు, విద్యా రంగంలో AI వినియోగాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల కోసం AI ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ అసెస్మెంట్లు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించేందుకు వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Also Read: Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
AI అభివృద్ధితో పాటు, కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులను కేటాయించింది. ఈ చర్య ద్వారా అదనంగా 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్, విద్యా సదుపాయాలు అందించనుంది. IIT భిలాయ్, IIT ధార్వాడ్, IIT గోవా, IIT జమ్మూ, IIT తిరుపతి లాంటి ఐదింటికి ఈ విస్తరణ లభించనుంది. సాంకేతికత, AI, విద్య – ఈ మూడు రంగాల్లో అభివృద్ధి సాధించి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ వ్యూహం ద్వారా AI పరిశోధనను వేగవంతం చేసి, దేశాన్ని AI రంగంలో అగ్రగామిగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.
Also Read: Railway Stocks: బడ్జెట్ సెషన్స్ వేళ లాభాల్లో రైల్వే స్టాక్స్..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. భారతదేశంలో AI ప్రతిభను పెంచేందుకు, పరిశోధన అవకాశాలను మెరుగుపర్చేందుకు, విద్యా వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత విద్యా వ్యవస్థలో AI వినియోగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు, దేశ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారబోతున్నాయి.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..