Bhadradri: భద్రాద్రి తలంబ్రాలకు భలే డిమాండ్.. ఆర్టీసీ డోర్ డెలివరీకి అనూహ్య స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Ramaiah Kalyana Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలకు ఈ ఏడాది ఊహించని విధంగా స్పందన లభించింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు 20వేల మంది అధికంగా తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. టీఎస్ఆర్టీసీ ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి దశలో 50,000 మందికి ఆర్టీసీ తలంబ్రాలను డోర్ డెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బుకింగ్స్కు అవకాశం కల్పిస్తూ గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులకు తలాంబ్రాలను రెండు, మూడు రోజుల్లో అందజేయనున్నారు.
Read Also: Prisoner Escape: సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
భద్రాద్రి రాముల వారి కల్యాణ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ చేసుకోగా.. హైదరాబాద్ బస్భవన్లో ఇవాళ ఆయనకు సంస్థ లాజిస్టిక్స్ బిజినెస్ హెడ్ పి.సంతోష్కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాల కోసం భక్తుల నుంచి భారీగా బుకింగ్స్ వస్తున్నాయని సజ్జనార్ చెప్పారు. గతేడాది 88 వేల మంది బుక్ చేసుకోగా, ఈ ఏడాది లక్ష మందికి పైగా బుక్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. మొదటగా 50,000 మందికి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం హోం డెలివరీ చేస్తోందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. భద్రాద్రి తలాంబ్రాలు కావాలనుకునే వారు.. టీఎస్ ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. 9177683134, 7382924900, 9154680020 నంబర్లను సంప్రదించొచ్చు అని సూచించారు. భక్తులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని విశిష్టమైన తలంబ్రాలని పొందాలని ఆయన సూచించారు.
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు #TSRTC తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఈ ముత్యాల తలంబ్రాలను ఈ రోజు స్వీకరించడం జరిగింది. pic.twitter.com/TvHBoUj0Mz
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 3, 2023
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!