Bhadradri: భద్రాద్రి తలంబ్రాలకు భలే డిమాండ్.. ఆర్టీసీ డోర్ డెలివరీకి అనూహ్య స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Ramaiah Kalyana Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలకు ఈ ఏడాది ఊహించని విధంగా స్పందన లభించింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు 20వేల మంది అధికంగా తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. టీఎస్ఆర్టీసీ ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి దశలో 50,000 మందికి ఆర్టీసీ తలంబ్రాలను డోర్ డెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బుకింగ్స్కు అవకాశం కల్పిస్తూ గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులకు తలాంబ్రాలను రెండు, మూడు రోజుల్లో అందజేయనున్నారు.
Read Also: Prisoner Escape: సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
భద్రాద్రి రాముల వారి కల్యాణ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ చేసుకోగా.. హైదరాబాద్ బస్భవన్లో ఇవాళ ఆయనకు సంస్థ లాజిస్టిక్స్ బిజినెస్ హెడ్ పి.సంతోష్కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాల కోసం భక్తుల నుంచి భారీగా బుకింగ్స్ వస్తున్నాయని సజ్జనార్ చెప్పారు. గతేడాది 88 వేల మంది బుక్ చేసుకోగా, ఈ ఏడాది లక్ష మందికి పైగా బుక్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. మొదటగా 50,000 మందికి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం హోం డెలివరీ చేస్తోందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. భద్రాద్రి తలాంబ్రాలు కావాలనుకునే వారు.. టీఎస్ ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. 9177683134, 7382924900, 9154680020 నంబర్లను సంప్రదించొచ్చు అని సూచించారు. భక్తులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని విశిష్టమైన తలంబ్రాలని పొందాలని ఆయన సూచించారు.
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు #TSRTC తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఈ ముత్యాల తలంబ్రాలను ఈ రోజు స్వీకరించడం జరిగింది. pic.twitter.com/TvHBoUj0Mz
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 3, 2023
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!