Mantena Ramaraju: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన నియోజకవర్గం నుంచి మరొకరికి తెలుగు దేశం పార్టీ టికెట్ ఇస్తుందనే ప్రచారంతో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (ఏప్రిల్9) కార్యకర్తల ఆత్మీయ సమావేశం తర్వాత రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుంటాను అని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. వారు చెప్పినట్టుగానే చెస్తాను.. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు.
Read Also: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..!
Also Read
కాగా, ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మరో చోట తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో ఎమ్మెల్యే రామరాజు వర్గం ఆందోళనకు గురౌతుంది. దీంతో రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీ రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారని ఇటీవల పాలకొల్లులో ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో మంతెన రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇక, టీడీపీ తొలి విడుతలో ఎమ్మెల్యే మంతెన రాజరాజు పేరును ప్రకటించిన తర్వాత ఇప్పుడు సీటు మార్పు చేయడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురి కావడంతో మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యాడు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో