Undavalli Arun Kumar: రాహుల్లో ఇప్పుడు రాజీవ్ కనిపిస్తున్నారు.. కర్ణాటక ఫలితాలపై ఉండవల్లి కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar: చిట్ ఫండ్ కంపెనీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు నాపై కోపం ఎందుకు ? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ వాళ్లు చర్చకు వెనుకకు ఎందుకు తగ్గారో అర్ధం కాలేదన్నారు.. ఇక, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. టీడీపీ, వైసీపీ నేతలు తిట్టుకుంటే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ఇక, మార్గదర్శి కేసును ఈ ఏడాదిలో ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఉండవల్లి.. రాష్ట్రంలో ఏ చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలు పాటించడం లేదన్న ఆయన.. చిట్స్ నిబంధనలు పాటించని వారిని ఏం చేయాలో ఒక కమిటీ వేయాలి.. చిట్స్ కేసుల్లో అరెస్టులు అనవసరం అన్నారు.
Read Also: Pooja Hegde : బ్లాక్ అండ్ బ్లాక్ లో బంగారు రంగు మేనితో బుట్టబొమ్మ మామూలుగా లేదు
Also Read
వైసీపీకి చెందిన వారు నిర్వహిస్తున్న చిట్స్ లో అక్రమాలు నా దృష్టికి రాలేదన్నారు ఉండవల్లి.. వస్తే చెప్పమన్నారు.. మార్గదర్శి చిట్ ఫండ్ పై చర్చకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి వెనుకకు తగ్గారు.. మళ్లీ తరువాత వస్తానన్నారు… వస్తే చర్చ ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు.. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ పై నేను కేసు వేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వామే దాడులు చేస్తోందన్న ఆయన.. మార్గదర్శి ఫైనాన్షర్స్ పైనే నా పోరాటం.. నా కేసులో జూన్ 15వ తేదీన కోర్టులో విచార ఉందన్నారు.. మరోవైపు కర్ణాటక ఎన్నికల విజయం సాధించిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందలు తెలిపారు ఉండవల్లి.. చరిత్ర పునావృత్తం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన.. బీజేపీ అధికారంలో ఉండటం మంచి పరిణామమే.. అయినా ఎవరూ ప్రశ్నించే స్థాయి లేకపోవడం ప్రమాదం అని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి మంచిది.. రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు ఉండవల్లి అరుణ్కుమార్..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!