Train Accident: నేడు రెండు రైలు ప్రమాదాలు.. పశ్చిమ బెంగాల్, దక్షిణ గోవాలో పట్టాలు తప్పిన రైళ్లు..
- పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కుమేద్పూర్ వద్ద రైలు ప్రమాదం
- పట్టాలు తప్పిన ఐదు కోచ్లు
- దక్షిణ గోవాలోని కొండ ప్రాంతంలో మరో రైలు ప్రమాదం
- 17 లోడు బోగీలతో రైలు పట్టాలు తప్పినట్లు అధికారుల వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కుమేద్పూర్ వద్ద గూడ్స్ రైలు ఐదు కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయాన్ని రైల్వే అధికార ప్రతినిధి ధృవీకరించారు. బీహార్-బెంగాల్ సరిహద్దు సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా ట్రాక్పై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రైల్వే కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు లైన్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లైన్లను క్లియర్ చేసే పనులను కతిహార్ డివిజనల్ రైల్వే మేనేజర్ పర్యవేక్షిస్తున్నారు.
READ MORE: Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్ఫోన్స్!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
దక్షిణ గోవాలో గూడ్స్ రైలు..
కర్ణాటక సరిహద్దులో ఉన్న దక్షిణ గోవాలోని కొండ ప్రాంతంలో శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో నైరుతి రైల్వే (SWR) మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. హుబ్లీ డివిజన్ పరిధిలోని సోనాలియం, దూద్సాగర్ స్టేషన్ల మధ్య ఘాట్ సెక్షన్లో ఉదయం 9.35 గంటలకు 17 లోడు బోగీలతో రైలు పట్టాలు తప్పిందని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మంజునాథ్ కన్మాడి తెలిపారు. దీంతో మూడు రైళ్లను దారి మళ్లించగా, మరో రెండు రైళ్లను రద్దు చేశారు.
READ MORE:Mrunal Thakur: కూతురు పేరు బయట పెట్టిన మృణాల్.. పెళ్లి కాకుండానే..?
సంఘటనా స్థలానికి 140 టన్నుల క్రేన్తో పాటు ఇతర అవసరమైన మెటీరియల్తో ప్రమాద సహాయ రైళ్లను పంపించామని, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. రైలు నం. 17420/17022 వాస్కోడగామా – తిరుపతి/హైదరాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ మార్గోవ్, కార్వార్, పాడిల్, సుబ్రమణ్య రోడ్, హాసన్, అర్సికెరె, చిక్కజాజూర్, రాయదుర్గం, బళ్లారి వైపు మళ్లించారు. రైలు 12779 వాస్కోడగామా – హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ మార్గోవ్, రోహా, పన్వెల్, కళ్యాణ్, పూణే మీదుగా నడిపారు. హజ్రత్ నిజాముద్దీన్-వాస్కోడా గామా ఎక్స్ప్రెస్ (12780) కూడా దారి మళ్లించారు. 17309 యశ్వంత్పూర్-వాస్కోడగామా మరియు 17310 వాస్కోడగామా-యశ్వంత్పూర్ రెండు రైళ్లు రద్దు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!