MLA Raja Singh : నా ఫోటోలు, నా ఇంటి లొకేషన్ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు
- ఇద్దరిని పట్టుకున్నభద్రతా సిబ్బంది
- మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చి రెక్కీ చేశారని, నా ఇంటి ఫోటోలు & వీడియోలు తీశారని తెలిపారు. అనుమానం వచ్చి స్థానికులు వాళ్ళని పట్టుకున్నారని, అందులో మరో ఇద్దరు పరార్ అయ్యారన్నారు. స్థానికులు వారి ఫోన్ తెరిచి చూడగా నా ఫోటోలు & నా ఇంటి లొకేషన్ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారని, ఇద్దరు యువకులను మంగళ్హాట్ పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణ సాగుతోందని ఆయన తెలిపారు.
Also Read
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
Merugu Nagarjuna: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
అంతేకాకుండా..’అయితే నేను వెంటనే ఈ విషయం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కి కాల్ చేసి చెప్పాను.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దమన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.. ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 2010లో కూడా నా ఇంటి వద్ద రెక్కీ చేశారు. గతంలో ISI ఏజెంట్ను అరెస్టు చేశారు. తరువాత కూడా చాలాసార్లు నా గురించి రెకి జరిగింది. ఇప్పుడు నా ఇంటివద్ద రెక్కీ చేసిన వారు షేక్ ఇస్మాయిల్ వయస్సు (30), మహ్మద్ ఖాజా (24) బోరబండ ప్రాంతమని తెలుస్తుంది. ఎందుకోసం నా ఇంటికి వచ్చారు విరి వెనుక ఎవరున్నారు ఏం కుట్రా జరుగుతోంది తెలియాలి.. గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను నాకు ఈ పోలీసులపై నమ్మకం లేదని’ అని రాజాసింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!