Boys Marriage: పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boys Marriage: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది . ఈ క్రమంలోనే తమకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు.. రాజకుమారుడు లాంటి వరుడు వస్తే బాగుండు అనే అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాము పెళ్లి చేసుకోబోయే వారి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా వెనక ముందు అన్ని చూసుకుని ఇక పెళ్లి బంధంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత దాంపత్య జీవితాన్ని ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు అమ్మాయిలు వివాహబంధంతో ఒక్కటవ్వడం లాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి తరహా ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సారి మాత్రం వారి పెళ్లికి ఓ పెద్ద కారణమే ఉందండోయ్.. అదేంటంటే.. వారి గ్రామంలో వర్షాల కోసం ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారట. ‘వాన దేవతలను’ ప్రసన్నం చేసుకునేందుకు ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.
Also Read: Samosa History: భారతదేశంలో సమోసా ఎక్కడ నుండి వచ్చింది? దీని చరిత్ర ఏమిటో తెలుసా?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మాండ్యా జిల్లా కృష్ణరాజ్పేట తాలూకాలోని గ్రామస్థులు శుక్రవారం రాత్రి ఇద్దరు అబ్బాయిల వివాహాన్ని నిర్వహించారు. వాన దేవతలను శాంతింపజేయడానికి, ఈ ప్రాంతంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ఇద్దరు అబ్బాయిల వివాహంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో గ్రామంలో గ్రామస్థులు ఈ పూజలు నిర్వహించారు. ఈ విధంగా ప్రజలు పాత సంప్రదాయాలను ఆశ్రయించారని, వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వింత సంప్రదాయాలను అనుసరిస్తున్నారని స్థానికులు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి, వధూవరులుగా వివాహ వేడుకలో పాల్గొన్న ఇద్దరు అబ్బాయిలను స్థానికులు చూశారు. వర్షం లోటు తీర్చాలని స్థానికులు వానదేవుడిని ప్రార్థించడంతో కల్యాణోత్సవంలో భాగంగా గ్రామస్థులకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. “వాన దేవతలను శాంతింపజేసేందుకు, గ్రామస్థులచే ఈ ప్రాంతానికి వర్షాలు కురిపించడానికి ప్రార్థనా ఆచారంలో భాగంగా ఇది జరిగింది. వివాహం తర్వాత విందు కూడా ఏర్పాటు చేయబడింది” అని వారు చెప్పారు. రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, అందుకే గతేడాదితో పోలిస్తే వర్షాలు కురవలేదని, దీంతో రాష్ట్ర ప్రజలు పాత సంప్రదాయాలను ఆచరిస్తున్నారని స్థానికులు తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!