మరో కొత్త ఫీచర్ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది. 2022 అక్టోబర్ లో మొదటిసారిగా ట్విట్టర్ ఎడిట్ ఆఫ్షన్ ను తీసుకు వచ్చింది. ప్రారంభంలో యూజర్లు తమ పోస్టును పోస్ట్ చేసిన 30 నిమిషాల్లో ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. యూజర్ల డిమాండ్ మేరకు ఈ టైంను గంటకు పొడిగించింది. ఎడిట్ ఆఫ్షన్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ లభిస్తోంది.
Also Read : Hackers: పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ హ్యాక్.. అశ్లీల వీడియో అప్లోడ్..!
ట్విట్టర్ కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఫీచర్ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది బ్లూ టిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ సంస్థ భావించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు బ్లూ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు నెలకు 650 రూపాయలు చెల్లించాలి.
Also Read : North Korea : ఆత్మహత్యలపై నిషేధం.. కిమ్ సంచలన నిర్ణయం
బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ వినియోగదారులు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునే వీలును పొందుతారు. అంతేకాకుండా 1080 పీలో వీడియోలను అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే, రిప్లై, మెన్షన్, సెర్చింగ్లో వీరికి ప్రాధాన్యత ఉంది. సాధారణ వినియోగదారుల కంటే 50 శాతం తక్కువ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి. కొత్త ఫీచర్లకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. సబ్స్క్రైబర్లు తమ హ్యాండిల్, డిస్ప్లే పేరు లేదా ప్రొఫైల్ పిక్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.