Thummala Nageswara Rao: సీఎం కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. అయితే, పాలేరులో స్వర్గీయ రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికల్లో అయన సతీమణికి టికెట్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు అడ్డుపడి నేనే పోటీ చేస్తానని నన్ను బ్రతిమాలితే.. టికెట్ ఇచ్చి మేమంతా దగ్గర వుండి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అని తుమ్మల అన్నారు. నిజానికి ఆరోజు పాలేరు నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను పోటీ చేశానన్న సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
Read Also: Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
నాపై ఇన్ని విమర్శలు చేసిన కేసీఅర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖమ్మం జిల్లాలో కేవలం నీ పార్టీకి వచ్చింది కేవలం కొత్తగూడెం సీటు మాత్రమే కదా అని తుమ్మల అన్నారు. ఆ తరుణంలోనే కదా మీరు స్వయంగా నా దగ్గరకు వచ్చి మూడు గంటల సేపు బ్రతిమాలి మరీ నన్ను పార్టీలోకి ఆహ్వానించింది.. నేనేమైనా పైరవీల కోసం, పదవుల కోసం మీ పార్టీలో చేరానా? ఆరోజు పార్టీలో చేరే ముందు కూడా పదవుల గురించి నేను మాట్లాడలేదు.. కేవలం భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టుల గురించి పార్టీలో జాయిన్ అవుతున్నాను అని నేను మీకు చెప్పింది నిజం కాదా?..
దానికి మీరు ఒప్పుకున్నది నిజం కాదా? అని కేసీఆర్ ను తుమ్ముల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
Read Also: Skanda : స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది…
ఈరోజు నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఎంత వరకు సమంజసం కేసీఆర్ అని తుమ్మల నాగేశ్వరరావు అడిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అనే నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు మీ పార్టీకి జెండా పట్టే కార్యకర్త లేడు.. కేవలం నేను పార్టీలో జాయిన్ అయిన తరువాత 280 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటి అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీతో సహా వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి మీ సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి మర్చిపోయి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన ధ్వజమెత్తారు.
Read Also: Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?
అసలు 2018 ఎన్నికల్లో పాలేరులోలో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు అని తుమ్మల అన్నారు. పువ్వాడ అజయ్ ని మంత్రిని చేయడం కోసం.. ధనదాహంతో ఆయనతో కలిసి వ్యాపారాలు, హైదరాబాద్ బాచుపల్లిలో మమత మెడికల్ కాలేజీ పెట్టుకోవడం కోసం స్వయంగా నీ కొడుకే నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడించింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా ఎన్నికలకు నెల రోజుల ముందు టికెట్లు కేటాయించి నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా?.. పార్టీలో జరుగుతున్న అణ్యధోరణులను ఎప్పటికప్పుడు మీకు చెప్పినప్పటికీ మీరు పెడచెవిన పెట్టి పార్టీని భ్రష్టుపట్టిపోవడానికి కారణం మీరు కాదా?.. ఇంత జరిగినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఎవరిని సంప్రదించకుండా ఆప్పటికపుడు నామా నాగేశ్వరరావుకు ఎంపీ టికెట్ కేటాయిస్తే పార్టీకి కట్టుబడి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించింది నిజం కాదా?.. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను చేసిన కృషి చేసింది మీకు తెలియదా? అని తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ను ప్రశ్నించారు.
Read Also: Mrunal Thakur: బ్లాక్ డ్రస్సులో మృణాల్ ఠాకూర్ మైండ్ బ్లోయింగ్ అందాలు
మీరు స్వయంగా భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభానికి వచ్చినపుడు సభలో అపర భగీరథున్ని నేను కాదు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అని నా గురించి మీరు ఆన్న మాటలు ఇంకా పాలేరు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని మీరు నాకు ఇచ్చిన కితాబు ఇంకా పాలేరు ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉందనే విషయం మర్చిపోయి మీరు నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం అంటూ ఆయన వ్యాఖ్యనించారు. 40 సంవత్సరాల మన ఇద్దరి సహవాసంలో నేనేంటో.. నా నిబద్దత ఏమిటో తెలిసి కూడా నా పార్టీ మార్పు గురించి ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడటం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!