Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummala Nageswara Rao At World Food Conference

Tummala Nageswara Rao : ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు

Published Date :September 19, 2024 , 5:54 pm
By Gogikar Sai Krishna
Tummala Nageswara Rao : ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరానని, కొత్తగూడెం విమానాశ్రయం కోసం భూమి కేటాయింపు జరిగినా ముందడుగు పడలేదన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించానని, ఆయన కళ్ళారా చూశారు. అందుకే తగిన మొత్తంలో కేంద్రం నుంచి సహాయం అందజేయాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నివేదిక రాగానే త్వరగా సహాయం అందిస్తామని చెప్పారని, ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తేనే ఆ పంట సాగు చేసే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పాననన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!

Also Read

  • Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
  • Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు..!
  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

అంతేకాకుండా..’దిగుమతులను తగ్గించి దేశీయంగా ప్రోత్సహిస్తే పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తగ్గించవచ్చని చెప్పాం. 28% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. ఆయిల్ ఫాం కు కేంద్రం కనీస మద్దతు ధర కల్పించాలని కోరాను. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసి, తెలంగాణ లో ఎక్కువగా పండే పంటలకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలని కోరాం. రైతు బంధు అంటే, పంట వేసే రైతుకు చేయూత. వ్యవసాయం చేసే రైతుకు చేయూత ఇవ్వాలనేదే రైతు బంధు. రైతు బంధు ఎవరు తీసుకోవాలో, కౌలు రైతులు, ఓనర్లు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో పంటల భీమా విషయంలో, వచ్చే నెల నుంచి పంటలకు మేమే ప్రీమియం కట్టి పంటలకు ఇన్సూరెన్స్ చేస్తాం. పంటల ఇన్సూరెన్స్ కోసం 3 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.

Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!

ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరు. గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారు. ఇప్పుడు 42 లక్షల మంది రైతులున్నారు. రైతు క్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది. 5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తాం. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చేయనుంది. ప్రతిపంట, ప్రతిరైతు కు భీమా వర్తించేలా 3000 కోట్లతో ఇన్సూరెన్స్.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • tummala nageswara rao
  • World Food Conference

తాజావార్తలు

  • Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..

  • Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు..!

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..

  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

  • Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి?

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions