Maharastra : మ్యాంగో జ్యూస్లో నిద్రమాత్రలు కలిపిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని తుల్జాపూర్లో భర్తకు మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది భార్య. బాధిత భర్త తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుటుంబం మొత్తానికి అతని భార్య ఇలా చేసింది. దీంతో ఒక రోజంతా వారు నిద్రలోనే ఉండిపోయారు. మరుసటి రోజు అతను నిద్ర లేచినప్పుడు తన శరీరం నుండి చాలా నొప్పిని అనుభవించాడు. ఆ తర్వాత అతడు భార్యను నిలదీయగా నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తుల్జాపూర్ తాలూకా నంద్గావ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహేష్ కుమార్ తన భార్య, మొత్తం కుటుంబంతో ఈ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మహేష్ భార్య పేరు భాగ్యవతి చింగుండే. మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 24న అతని భార్య భాగ్యవతి తన భర్త మహేష్ని భోజనానికి పిలిచింది. ఈ విందు కోసం మహిళ ప్రత్యేకంగా మ్యాంగో జ్యూస్ సిద్ధం చేసింది. ఆమె దాంట్లో అనే నిద్ర మాత్రలను కలిపింది.
Read Also:Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మహేష్ కుమార్, అతని కుటుంబం జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసినప్పటికీ భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపింది. దానిని మహేష్, అతని కుటుంబ సభ్యులు తీసుకున్నారు. ఇది తిన్న మహేష్ తో పాటు కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం చాలాసేపు నిద్రపోయారు. నిద్ర నుంచి లేచి చూసే సరికి శరీరం నొప్పిగా ఉందని మహేష్ తెలిపాడు. ఈ విషయాన్ని మహేష్ తన భార్యకు చెప్పగా, ఆమె మొత్తం నిజాన్ని అంగీకరించింది. ఆమ్రాలలో నిద్రమాత్రలు కలిపినట్లు భాగ్యవతి చెప్పింది. ఇది విన్న మహేష్ కోపానికి అవధులు లేవు. భార్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు చేరుకుని అతడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసు బృందం కేసు దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు భాగ్యవతి చింగుండేపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు ఎందుకు తన భర్త కుటుంబానికి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Supreme court: తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!