Maharastra : మ్యాంగో జ్యూస్లో నిద్రమాత్రలు కలిపిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని తుల్జాపూర్లో భర్తకు మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది భార్య. బాధిత భర్త తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుటుంబం మొత్తానికి అతని భార్య ఇలా చేసింది. దీంతో ఒక రోజంతా వారు నిద్రలోనే ఉండిపోయారు. మరుసటి రోజు అతను నిద్ర లేచినప్పుడు తన శరీరం నుండి చాలా నొప్పిని అనుభవించాడు. ఆ తర్వాత అతడు భార్యను నిలదీయగా నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తుల్జాపూర్ తాలూకా నంద్గావ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహేష్ కుమార్ తన భార్య, మొత్తం కుటుంబంతో ఈ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మహేష్ భార్య పేరు భాగ్యవతి చింగుండే. మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 24న అతని భార్య భాగ్యవతి తన భర్త మహేష్ని భోజనానికి పిలిచింది. ఈ విందు కోసం మహిళ ప్రత్యేకంగా మ్యాంగో జ్యూస్ సిద్ధం చేసింది. ఆమె దాంట్లో అనే నిద్ర మాత్రలను కలిపింది.
Read Also:Prajwal Revanna: జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మహేష్ కుమార్, అతని కుటుంబం జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసినప్పటికీ భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు కలిపింది. దానిని మహేష్, అతని కుటుంబ సభ్యులు తీసుకున్నారు. ఇది తిన్న మహేష్ తో పాటు కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం చాలాసేపు నిద్రపోయారు. నిద్ర నుంచి లేచి చూసే సరికి శరీరం నొప్పిగా ఉందని మహేష్ తెలిపాడు. ఈ విషయాన్ని మహేష్ తన భార్యకు చెప్పగా, ఆమె మొత్తం నిజాన్ని అంగీకరించింది. ఆమ్రాలలో నిద్రమాత్రలు కలిపినట్లు భాగ్యవతి చెప్పింది. ఇది విన్న మహేష్ కోపానికి అవధులు లేవు. భార్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు చేరుకుని అతడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసు బృందం కేసు దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు భాగ్యవతి చింగుండేపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. భాగ్యవతి మ్యాంగో జ్యూసులో నిద్రమాత్రలు ఎందుకు తన భర్త కుటుంబానికి ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Supreme court: తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..