Tulip Garden : తులిప్ గార్డెన్కు పర్యాటకుల తాకిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ము కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చ్ 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు. గతేడాది సుమారు 3.62 లక్షల మంది తులిప్ పూలను చూశారు. కాగా.. ఈ ఏడాది గార్డెన్ ను సందర్శించిన పర్యాటకుల్లో 3 లక్షలకుపైగా పర్యాటకులు జమ్ము కశ్మీర్ వెలుపల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరిలో 3125 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు.
Also Read : Meena Daughter : కూతురు మాటలకు బోరున ఏడ్చేసిన మీనా
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
శ్రీనగర్ లోని తులిప్ తోట.. ఆసియాలోనే అతి పెద్దది.. ప్రకృతి అందాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది టూరిస్టులు శ్రీనగర్ కు క్యూ కడుతుంటారు. దేశ, విదేశాల నుంచి భారీగా తరలివస్తుంటారు. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసించే సీజన్ లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గెర్డెన్ ను అధికారులు తెరుస్తుంటారు. ఈ ఏడాది మార్చి 19 నుంచి గార్డున్ లోకి సందర్శకులను అనుమతించారు. ఏప్రిల్ 20న మూసివేశారు.
Also Read : Stray Dogs: వీధి కుక్కలకు మరో చిన్నారి బలి..
ఈ పూల గార్డెన్ ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతో పాటు చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్ కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్స్ ఉన్నాయి. అయితే శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు ఏకంగా 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. అయితే తులిప్ గార్డెన్ కు అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను సృష్టించాలనేదే తమ లక్ష్యమని గార్డెన్ ఇన్ ఛార్జ్ అన్నారు. ఈ సంవత్సరం థాయ్ లాండ్, అమెరికా, అర్జెంటినా, యూరోపియన్ దేశాల నుంచి పర్యాటకులు వచ్చారని వెల్లడించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!